Nagarjuna Sagar: డిసెంబరు వరకూ తెలంగాణకే నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యత
ABN , Publish Date - Jul 30 , 2025 | 03:39 AM
వచ్చే డిసెంబరు 24వ తేదీ దాకా నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ ఎం) పనులతోపాటు

అధికారుల వివరాల కోసం కృష్ణాబోర్డు లేఖ
హైదరాబాద్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే డిసెంబరు 24వ తేదీ దాకా నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ ఎం) పనులతోపాటు వానాకాలంలో స్పిల్వే గేట్ల ఆపరేషన్ బాధ్యతలను తెలంగాణకు అప్పగించేందుకు కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) అంగీకరించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి బోర్డు మంగళవారం లేఖ రాసింది. హిల్కాలనీ ఇరిగేషన్ సర్కిల్లో పనిచేసే అధికారులతోపాటు రాత్రిపూట విధులు నిర్వర్తించే డీఈఈ/ఏఈఈలు, ఏఈల వివరాలు అందించాలని కోరింది. సాగర్ ప్రస్తుతం కృష్ణా బోర్డు పాక్షిక పర్యవేక్షణతోపాటు సీఆర్పీఎఫ్ రక్షణలో ఉంది. .