BRS VS Congress: జనగామ జిల్లాలో హైటెన్షన్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:23 PM
జనగామ జిల్లాలోని పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది. దీంతో నేతలు పోటాపోటీగా ఘర్షణ పడుతున్నారు.

జనగామ: జిల్లాలోని పాలకుర్తిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ (BRS VS Congress) శ్రేణుల మధ్య తెలంగాణ తల్లి విగ్రహ పంచాయితీ (Telangana Talli Statue Controversy) కొనసాగుతోంది. రేపు(జూన్2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ విషయంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం రాజుకుంది. గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపంలోని విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు.
కాంగ్రెస్ నేతల ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించారు. రేపు (సోమవారం) తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గులాబీ పార్టీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేతల అరెస్ట్కు నిరసనగా మాజీ మంత్రి ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు ఆందోళన చేపట్టారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా పాలకుర్తి చౌరస్తాలో ఉషా దయాకర్ రావు ఆందోళన చేపట్టారు. ర్యాలీగా వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు మధ్య హై టెన్షన్ వాతావరణం నెలకొంది, పోలీసులతో గులాబీ పార్టీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. తమ నేతలను విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వేములవాడలో కొనసాగుతోన్న కోడెల మృత్యు ఘోష.. స్పందించిన కలెక్టర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
For Telangana News And Telugu News