కాళేశ్వరం ప్రాజెక్ట్పై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని సూచించారు.
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
Warangal News: పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటపై పోలీస్స్టేషన్లోనే యువతి బంధువులు దాడి చేశారు. ప్రేమించుకున్న జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేమ జంటకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా దాడికి దిగారు.
డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్యానాయక్తో మరికొంతమంది నేతలపై పోలీసులు కేను నమోదు చేశారు.
Telangana Formation Day: జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరంగల్ జిల్లాలో పలువురు మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేయనున్నారు.
జనగామ జిల్లాలోని పాలకుర్తిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటు విషయంలో వివాదం రాజుకుంది. దీంతో నేతలు పోటాపోటీగా ఘర్షణ పడుతున్నారు.
Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.
Drug Control Raids: నిజామాబాద్లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు.
Encounter: ఛత్తీస్గఢ్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు కశ్మీర్లో విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య (army jawan suicide) చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.