Home » Warangal News
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
మాజీ మంత్రి కేటీఆర్కు జైలు జీవితం తప్పదని కాంగ్రెస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్కు ఇచ్చిన హామీలను మరిచిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు.
Sim Cards Misuse: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సిమ్ కార్డులను తమ వ్యక్తిగతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గవర్నర్ పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో విద్యార్థి సంఘాల నేతలను వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
అక్కడి అధికారపార్టీలో ప్రకంపనలు రేపిన ఆయన వ్యాఖ్యలపై రగడ చల్లారకముందే.. ఆయన కూతురు పెట్టిన సోషల్ మీడియా అకౌంట్ అప్డేట్ ఆ జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. అక్కడి నుంచి పోటీచేసే అభ్యర్థిని తానే అంటూ ..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి కాజీపేట రైల్వే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన విడుదలయ్యారు. బెయిల్పై విడుదలైన కౌశిక్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసానికి బయలుదేరారు.
వరంగల్ కోర్ట్ ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డయల్100 నెంబర్కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష గట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఉన్నంత వరకు కార్యకర్తలను కాపాడుకుంటానని కొండా మురళి హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు.