Share News

MP Nagesh: ఆ నిధులు ఏమయ్యాయి.. రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - May 17 , 2025 | 02:49 PM

BJP Adilabad MP Nagesh: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం గత అక్టోబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.

MP Nagesh: ఆ నిధులు ఏమయ్యాయి.. రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ప్రశ్నల వర్షం
BJP Adilabad MP Nagesh

ఆదిలాబాద్: ఆదివాసీ, గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను జిల్లాలకు పంపకుండా ఐదారు నెలలుగా రేవంత్ ప్రభుత్వం (Revanth Government) పెండింగ్‌లో పెట్టిందని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ (BJP Adilabad MP Nagesh) అన్నారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ కార్యకలాపాలకు వాడుకుంటుందని ఆరోపించారు. అలాగే అత్యంత పేదవారైన ఆదివాసీల కోసం ఇచ్చిన ఇళ్లను వారు నిర్మించుకున్నారని.. వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా ఆదివాసీ, గిరిజనులకు ఇవ్వడం లేదని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ మండిపడ్డారు.


ఆదివాసీ విద్యార్థుల స్కాలర్ షిప్ కోసం గత అక్టోబర్‌లోనే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా నిధులను రేవంత్ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ప్రశ్నించారు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడానికి, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలిపారు. ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా ఆదివాసీ గిరిజనులకు మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధులు కూడా విడుదల చేయలేదని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. గిరిజన, ఆదివాసీలను ఎంత మోసం చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. సోమవారంలోగా ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ నగేష్ డిమాండ్ చేశారు.


కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టుకోవాలి: రాంచందర్‌రావు

కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం అయితే బీజేపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత రాంచందర్ రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టుకోవాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ కార్యాలయం మీద దాడులు చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్ కార్యకర్తల విధానం మారకపోతే గాంధీభవన్ కూడా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ బందోబస్తు ఏమిటని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని కల్చర్‌ను తెలంగాణకు తీసుకుని రావడం మంచిది కాదని రాంచందర్ రావు హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్‌ ఇవ్వలేం: హైకోర్టు

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 03:03 PM