కస్తూర్బా విద్యాలయాల్లో(కేజీబీవీ) చదివే బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కస్తూర్బా విద్యాలయాలను దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది.
రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో పాల్గొని రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో శనివారం భారీ వర్షం కురిసింది.
సీపీఆర్పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు. శనివారం వాంకిడి మండ లంలోని సామె గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదేశాల మేరకు వాంకి డి పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థులకు సీపీఆర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలుకాకపోవడంతో ప్రత్యేక విభాగాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలోని 6 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల పిల్లలందరికీ తప్పనిసరిగా ఉచిత, నిర్బంధ విద్య అమలు చేయాల్సి ఉంది.
ఏరువాక పౌర్ణమిని పురష్కరించుకొని దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో బుధవారం వైభవంగా జ్యేష్ట ఏరువాక పౌర్ణమి జాతర జరిగింది.
మంగళవారం రాత్రి వీచిన గాలిభీభత్సవానికి చెట్లు విరిగిపోయి కరెంటు వైర్లు నేలకూలాయి. అలాగే కోమటి చేను, కొండాపూర్, రేవులగూడెం, ముత్యంపల్లి, కుర్రెగడ్లో ఇంటి పైకప్పు లేచి తడిసిన గోడలతో ఇళ్లు కూలాయి. ఇంట్లో వవ్చిన శబ్దానికి అప్రమత్తమైన కుటుంబసభ్యు లు బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది.
మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని.. నియోజకవర్గానికి నేనే రాజును నేనే మంత్రిని అని ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు అన్నారు.
రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ రైతులకు సాగులో అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు.
సిర్పూరు నియోజకవర్గంలో పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని, వెంటనే ఆపాలని కోరుతూ సోమవారం హైదరాబాద్లోని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణకు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్బాబు వినతి పత్రం అందజేశారు.