రాష్ట్రంలో రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం తాజాగా పంటల బీమా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సందర్భంగా పంట బీమా అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో దాన్ని నెరవేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వచ్చే నెల 20న చేపట్టే సార్వత్రిక సమ్మెను అంతా కలిసి విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు పిలుపునిచ్చారు. సోమవారం కాగజ్నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
: వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అదనపు కల్టెర్ దీపక్ తివారి అన్నారు. కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలసి అర్జీదారుల నుంచి సోమవారం దరఖాస్తులు స్వీకరించారు.
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. దహెగాం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి నూతన చట్టంలో పొందుపరిచిన అంశాలపై రైతులకు సోమవారం అవగాహన కల్పించారు.
కొన్ని రెస్టారెంట్లలో తయారయ్యే బిర్యానీలో కుళ్లిపోయిన చికెన్, మటన్ను వండి వడ్డిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కొంతమంది హోటళ్ల యజమానులు హోల్సేల్గా మాంసాన్ని కొనుగోలు చేసి, రోజుల తరబడి నిల్వచేసి వంటకాలకు వినియోగిస్తున్నారు. దీంతో ప్రమాదకరమైన బ్యాక్టీరియా చేరి ఆరోగ్యానికి హానికరంగా మారే ప్రమాదం ఉంది.
మారుమూల గిరిజన ప్రాంతం దేవాపూర్లో నాలుగున్నర దశాబ్దాల క్రితం బీర్లా యాజమాన్యం ఓరియంట్ సిమెంట్ కంపెనీని స్థాపించింది. అనతికాలంలోనే ఆసియా ఖండంలో దిగ్గజ సిమెంట్ కంపెనీగా ఎదిగింది.
మందమర్రి ఏరియాలోని కేకే 5 గని సమీపంలోని మంకీ ఫుడ్ కోర్టు వద్ద బుధవారం పెద్ద బుంగ డింది.
రైతుల శ్రేయస్సు కోసమే భూ భారతి నూతన ఆర్వోఆర్ చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం మందమర్రి మండలంలోని సండ్రోన్పల్లి, కాసిపేట మండల కేంద్రం లోని రైతు వేదికల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఎండలు మండిపోతున్నాయి.. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరుదొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. పశువుల దాహార్తి తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు అధికారుల అవగాహన తేమితో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించతలపెట్టి బీఅర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలిరావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు.