Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ కీలక భేటీ.. ఎందుకంటే..

ABN , Publish Date - May 27 , 2025 | 09:51 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ సక్సేనా మంగళవారం నాడు కడపలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ  కీలక భేటీ.. ఎందుకంటే..
CM Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును (CM Chandrababu Naidu) విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ (అడిషనల్ చార్జ్) ఎ.కె. సక్సేనా ఇవాళ(మంగళవారం) కడపలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ యాజమాన్యానికి సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.


గత కొంతకాలంగా మంచి పనితీరుతో స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి పెరిగిందని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలబాట పట్టేందుకు పటిష్టమైన, సమగ్రమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ సామర్థ్యం మేర ఉత్పత్తి జరపడంతో పాటు.... రానున్న రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు సంస్థ యాజమాన్యం తీసుకునే అన్ని చర్యలకు రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


అటు ప్లాంట్ ఉద్యోగులు, యాజమాన్యం సమన్వయంతో పనిచేసి ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్లాంట్ బాగుంటేనే తమకూ మంచిదని ఉద్యోగులు కూడా గుర్తించాలని అన్నారు. ఇదే సమయంలో ప్లాంట్ యాజమాన్యం కూడా సంస్థ లాభాలబాట పట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.11,440 కోట్లు మంజూరు చేసిందని గుర్తుచేశారు. మరో వైపు రాష్ట్రం ప్రభుత్వం వివిధ రూపాల్లో రూ.2,660 కోట్ల మేర ప్లాంట్‌కు అవసరమైన సహాయం అందించిందని స్పష్టం చేశారు. ఇన్ని వేల కోట్ల ప్రజల సొమ్ము పెట్టిన తర్వాత దీన్ని పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. మేనేజ్‌మెంట్‌పై తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని, కొందరు ప్లాంట్‌ను బలహీన పరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మన అందరి అంతిమ లక్ష్యం ప్లాంట్‌ను కాపాడుకోవడమేనని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. అన్ని విధానాలు పరిశీలించి, గుడ్ బిజినెస్ మోడల్‌ను అమలు చేయాలని సీఎండీకి సూచించారు సీఎం చంద్రబాబు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 09:59 PM