స్టీల్ ప్లాంట్పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ఘటనలపై విచారణ జరుగుతోందని తెలిపారు.
చింతూరు టూ మారేడుమిల్లి ఘాట్ రోడ్డు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాత్రి వేళ ఘాట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండా ఆంక్షల ఉత్తర్వులు జారీ చేశారు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్వాల్.
అనకాపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు తీసుకెళ్తున్న కుమార్తె.. తండ్రి కళ్లముందరే ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం (వేవ్స్)-2025 బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్లో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నది.
విశాఖపట్నం చరిత్రలో ‘2025 డిసెంబరు 12’ చిరస్థాయిగా నిలిచిపోనుంది.
వీధి కుక్కల నియంత్రణపై జీవీఎంసీ అధికారులు దృష్టిసారించారు. జనవరి నాటికి బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రుల వద్ద వీధి కుక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేసేందుకు నగరానికి విచ్చేసిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
విశాఖపట్నం పోర్టు యాజమాన్యం అక్కయ్యపాలెంలో గల స్టేడియం లీజును రద్దు చేసింది.
స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహం బాలికలు కోతుల దాడితో భయపడి హాస్టళను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో వసతిగృహం బోసిపోయింది.
గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ, గోవాడ షుగర్స్ను ఆదుకుంటామని, ఫ్యాక్టరీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం శోచనీయమని అన్నారు. వేలాది మంది రైతులు, కార్మికుల జీవితాలు ఆధారపడిన గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తు గురించి చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.