పాఠశాలల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల పునఃప్రారంభం మరికొంత ఆలస్యమయ్యేలా ఉంది.
స్వీట్లు, కేకులు బాగా తింటున్నారా?, తరచూ బేకరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తున్నారా?...అయితే మీరు ఆరోగ్యం గురించి ఒక ఆలోచించుకోవాల్సిందే.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లతో చేరిన విద్యార్థులపై అధికారులు దృష్టిసారించారు.
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఎక్కడ నిర్వహించాలనేది ఎట్టకేలకు ఖరారైంది.
నగరంలోని రైతుబజార్లలో దుకాణాల కోసం డ్వాక్రా సంఘాల సభ్యులు పోటీ పడుతున్నారు.
అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్ఈసీఎస్)లో అడ్డగోలుగా పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందిన వారిపై చర్యలు మొదలయ్యాయి.
‘ఒకటే జననం.. ఒకటే మరణం.. ఒకటే గమనం.. ఒకటే గమ్యం.. గెలుపు పొందు వరకూ అలుపులేదు మనకు..’ అన్నాడో సినీ కవి. అక్షరాలా అదే కసితో చదివి కానిస్టేబుల్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమంలో నిలిచాడు అచ్యుతాపురం మండలం దొప్పెర్లకు చెందిన గండి నానాజీ. పేదింట పుట్టిన ఈ విద్యా కుసుమం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అత్యుత్తమ ఫలితాన్ని సాధించాడు.
చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ఆర్థికంగా చితికిపోయిన వారి బతుకుల్లో వెలుగులు నింపింది. పవర్లూమ్స్కు 500, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించడంతో జిల్లాలోని చేనేత కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
మండలంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రోజూ 250 నుంచి 300 మంది వస్తుండగా, వారిలో జ్వర పీడితులే ఎక్కువ మంది ఉంటున్నారు.
అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం జిల్లా వ్యాప్తంగా శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు.