గ్రామాల్లో పక్కాగా ఫీవర్ సర్వే చేయాలని, జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో జమాల్బాషా ఆదేశించారు. మండలంలోని మారుమూల పినకోట పీహెచ్సీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. ఆ తరువాత వర్షం పడింది. అనకాపల్లి, నర్సీపట్నం, గొలుగొండ, సబ్బవరం, పాయకరావుపేట, ఎలమంచిలిలో చిరుజల్లులు కురిశాయి.
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల తుది జాబితా తయారీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 2,33,570 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
మండలంలో రూ.2 కోట్లతో 75 సాగునీటి కాలువల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి కాలువలను నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో భాషోపాధ్యాయ (లాంగ్వేజ్ పండిట్లు) కేడర్ను రద్దు చేయడంతో వారంతా ఆరేళ్ల నుంచి త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.
అనకాపల్లి జిల్లా పరవాడ రాంకీ ఫార్మా సిటీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సాయి శ్రేయాస్ కంపెనీలో విషవాయువులు పీల్చి ఇద్దరు సేఫ్టీ అధికారులు చనిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు ఎంత మంది వుంటే అంత మందీకి నగదు జమ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన మంత్రి జన్మన్ యోజన కింద చేపట్టిన పక్కా ఇళ్లకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. మూడు నెలల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్వ ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో 3,982 మంది లబ్ధిదారులకు రూ.25.43 కోట్లు అందాల్సి వుంది.
జీవీఎంసీ 54వ వార్డు పరిధిలోని రెడ్డికంచరపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది.