Home » Visakhapatnam
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత చేనేతలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రచారం చేశారు. చేనేతలకు సరికొత్త వెలుగులంటూ ఇంటింటికి వెళ్లి హోం మంత్రి కరపత్రాలను పంచారు.
ఆంధ్రప్రదేశ్లో విశాఖ గాజువాక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తోందని మౌనిక అనే మహిళను నిందితుడు రవీంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు.
డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ప్రియురాలిని దారుణంగా హత మార్చడంతో పాటు మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసేసిన కిరాతక సంఘటన గాజువాక ఎల్వీనగర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
విశాఖపట్నంలో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల నెట్వర్క్ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.
సింహాచలం కొండ దిగువన విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ 84వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విద్యుత్ శాఖ పోస్టుల భర్తీ, ఏయూ ఉద్యోగుల వయో పరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రి వినతులు స్వీకరించారు.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు విమానయానరంగంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. విమాన టికెట్ల ధరల పెరుగుదల విషయంలో ప్రయాణికులపై భారం పడకుండా ఉండేలా చర్చిస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. వైజాగ్లోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాల భూమిని ఆగస్టు 2024లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించిందని ప్రస్తావించారు.
విశాఖపట్నంలోని గాజువాకలో పర్యటించిన మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గాజువాకలో 4.75 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులతో పార్క్ను ప్రారంభించామని మంత్రి చెప్పారు.
మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి అనిత అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి నివాళులర్పించారు.