Home » Visakhapatnam
Raghurama: ప్రజా ఫిర్యాదులపై ఈ శాసనసభ కమిటీ మొదటి సమావేశం విశాఖలో ఏర్పాటు చేశామని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు అన్నారు. ఆ కమిటీ విధి విధానాలపై ప్రజలు, ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదని చెప్పారు. ఈ కమిటీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మీడియా ముందుకు వచ్చామని రఘురామరాజు తెలిపారు.
కూటమి ప్రుభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన పాపాలను పోలీసులు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. కేసుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. అనకాపల్లిలో గతంలో టీడీపీ నేతను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో వైసీపీకి చెందిన ముగురిని పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ మెట్రో ప్రాజెక్టుకు కొత్త కదలిక. ప్రొజెక్ట్కు కన్సల్టెంట్ కోసం ప్రకటన జారీ చేసింది. తొలి దశలో రూ.11,498 కోట్లతో 46.23 కిలోమీటర్ల మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధాన డిపో హనుమంతవాకలో ఏర్పాటు చేయబడుతుంది
Visakhapatnam Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది.
విశాఖ: సాగరతీర నగరం వైజాగ్లో మెట్రో చాలా మంది కల. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా కాలం నుంచి జనాలు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజం కానుంది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభజించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు.
ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్ చేయబడింది
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్లబ్కు భూమి కేటాయించిన విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తమకు తెలియకుండా కలెక్టర్కు లేఖ ఇవ్వడంపై ప్రశ్నించారు. విష్ణుకుమార్రాజు పొరపాటుగా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని క్షమాపణలు తెలిపారు.
దేశాభివృద్ధిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందని శతాబ్ది ఉత్సవాల్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ మధుమూర్తి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులు రూపకల్పన చేయాలని సూచించారు.
Chandramouli Last Rites: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అశృనయాల నడుమ, అధికారిక లాంఛనాలతో చంద్రమౌళి అంత్యక్రియలు నిర్వహించారు.
JS Chandramouli funeral: విశాఖ పాండురంగపురం నుంచి చంద్రమౌళి అంతిమయాత్ర మొదలైంది. రాజకీయ నేతలు, ప్రజలు, బంధువులు పెద్ద సంఖ్యల్లో అంత్యక్రియలో పాల్గొన్నారు.