Home » Vizag steel plant
విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం వెనక్కు తగ్గింది.
తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని.. లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.
విశాఖ రైల్వేస్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండీ సక్సేనా మంగళవారం నాడు కడపలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడారు.
విశాఖ స్టీల్ప్లాంట్ బ్లాస్ట్ఫర్నేస్-1లో గ్యాస్ లీక్ కావడంతో నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ ఆరోపించింది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా రు. ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు.
Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.
కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం ఉక్కు హౌస్లో కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Vizag Steel Plant: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామితో కలిసి ఆ శాఖ సహాయ మంత్రి బి. శ్రీనివాస వర్మ సందర్శించనున్నారు.
. ‘చంద్రబాబు 1997 నుంచి దావోస్ వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు జరగవు. చర్చిస్తారు.. కంపెనీల ఆసక్తి మేరకు ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు.