Share News

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

ABN , Publish Date - Jun 07 , 2025 | 02:22 PM

విశాఖ రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ
Visakhapatnam MP Bharat

విశాఖపట్నo: జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని(World Yoga Day) విశాఖపట్నంలో ఘనంగా నిర్వహిస్తున్నామని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ (Visakhapatnam MP Bharat) తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో జరిగే యోగా కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారని చెప్పారు. విశాఖలో నిర్వహించే యోగాకు ప్రపంచ రికార్డ్ కోసం సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇవాళ(శనివారం) విశాఖపట్నంలో ఎంపీ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.


కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వేజోన్‌కి జీఎంని నియమించిందని విశాఖపట్నం ఎంపీ భరత్ వెల్లడించారు. విశాఖ రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ జరుగుతుందని.. సుమారుగా రూ.500 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. కచ్చితంగా మార్పులు ఉంటాయని వివరించారు. స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించింది వాస్తవమేనని.. అవసరమైన మేరకు కార్మికులను విధుల్లో ఉంచి మిగతా వారిని తొలగిస్తున్నారని వెల్లడించారు విశాఖపట్నం ఎంపీ భరత్.


మళ్లీ బ్లాస్ట్, ఫర్నిస్ త్రీ, ప్రారంభిస్తారని.. అవసరమైతే ఆ సమయంలో కొంతమందిని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందని విశాఖపట్నం ఎంపీ భరత్ తెలిపారు. మంచి సామర్థ్యం ఉన్న కార్మికులను కూడా తొలగించే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని యాజమాన్యం ఇప్పటికే చెప్పిందని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కార్మికులు, యాజమాన్యం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని విశాఖపట్నం ఎంపీ భరత్ పేర్కొన్నారు.


కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతం: చిరంజీవి రావు

ఎన్డీఏ సమావేశం ఈ నెల 12వ తేదీన జరుగనున్నదని.. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ డాక్టర్. వేపాడ చిరంజీవిరావు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థనూ మరింత బలోపేతం చేస్తున్నామని చిరంజీవిరావు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ.. భక్తుల విశ్వాసానికి ప్రతీక

డీమ్డ్‌ యూనివర్సిటీగా ఆదిశంకర

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 01:26 PM