MP Kesineni Sivanath: జగన్ 2.0 కాదు 4.0 చూపించుకున్నా భయపడేది లేదు
ABN , Publish Date - May 21 , 2025 | 08:11 PM
MP Kesineni Sivanath: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.

ఎన్టీఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులపై చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Sivanath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రజాప్రతినిధిగా హుందాగా మాట్లాడాలని హితవు పలికారు. వైసీపీలో రౌడీల బాషా అలాగే ఉంటుందని విమర్శించారు. జగన్ 2.0 కాదు 4.0 చూపించుకున్నా తాము భయపడేది లేదని హెచ్చరించారు.
నిన్న తిరువూరులో టీడీపీ శ్రేణుల ధాటికి వైసీపీ అల్లరిమూకలు పారిపోయారని విమర్శించారు. తిరువూరులో ఇవాళ(బుధవారం) టీడీపీ మినీ మహానాడు జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు. ఎంపీ చిన్ని సమక్షంలో విసన్నపేటకు చెందిన పలువురు మహిళలు టీడీపీలో చేరారు. ఈ నెల 27వ తేదీన కడప గడపలో జరిగే టీడీపీ మహానాడును జయప్రదం చేయాలని కోరారు. మహానాడుకు టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు.
జగన్ను చూస్తే జాలేస్తోంది: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిను చూస్తే జాలేస్తోందని.. ఆయన ఇప్పటికీ ఊహల్లోనే బతుకుతున్నారని తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (MP Kalisetti Appalanaidu) విమర్శించారు. జగన్మోహన్రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు చూస్తే అధికారులను బెదిరించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఇవాళ(బుధవారం) విశాఖపట్నంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడారు.
జగన్ బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మారలేదనడానికి ఆయన మాటలే నిదర్శనమని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. జగన్ హయాంలో అడ్డంగా పనులు చేసిన వారందరూ జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకటే మాట చెబుతూ బతికేస్తున్నారని.. ఆయన మాట్లాడే మాటలు మాత్రం మారడం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి కుదిరితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడాలని సూచించారు. తమ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News