Home » AP Employees
ఏపీ ఉద్యోగుల బదిలీలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జూన్ 9వ తేదీ వరకు పొడిగించింది.ఉద్యోగుల బదిలీలపై మే15వ తేదీన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది.
AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీలో 1 /2019 సర్క్యూలర్ పునరుద్దరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
MP Kesineni Sivanath: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.జగన్ ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చూస్తూ ఊరుకోమని ఎంపీ కేశినేని శివనాథ్ హెచ్చరించారు.
Minister Dola Bala Veeranjaneya Swamy: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కోసం జిల్లాలో మూడంచెల వ్యవస్థ తెస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఉద్యోగుల సీనియారిటీతో పదోన్నతికి ఒక ప్రత్యేక చానల్ తెచ్చామని గుర్తుచేశారు.
AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు.
ఉద్యోగులు 6 గంటల తర్వాత కార్యాలయాల్లో ఉండొద్దనేది ఇప్పుడు తన విధానమని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీపీఎస్పై జీవో రిలీజ్ చేసిందని.. రెండ్రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్వయంగా సీఎం నారా చంద్రబాబు స్పందించి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి..
Andhrapradesh: ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు.. జీతాల కోసం ఎదురు చూపులు చూసేవారు. జీతాలు ఎప్పుడు పడతాయా అంటూ పడిగాపులు కాసేవారు. ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారి ఆశ నిరాశే ఎదురయ్యేది. గత నాలుగునరేళ్లుగా ఇదే పరిస్థితిని చవిచూశారు ఉద్యోగులు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జుడీషియల్ ప్రివ్యూ కమిషన్ (Judicial Review Commission)ను నియమించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కె.ఆర్. సూర్య నారాయణ (Surya Narayana) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఈనెల 24న జరిగే ఏపీ క్యాబినెట్ మెుదటి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఏపీలో ప్రభుత్వం మారడంతో కొంతమంది అధికారులు తమ అభ్యర్థనలను సీఎస్ జవహర్ రెడ్డికి (CS Jawahar Reddy) తిప్పుతున్నారు. ఇందులో భాగంగానే ఐ అండ్ పీఆర్ కమిషనర్ టీ. విజయకుమార్ రెడ్డి, ఏపీ బేవరేజర్స్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిలు తమ సర్వీసును పొడిగించాలంటూ కోరారు.