Share News

Minister TG Bharath: జగన్ హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారు

ABN , Publish Date - May 27 , 2025 | 06:05 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చామని ఏపీ మంత్రి టీజీ భరత్ ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతిస్తున్నామని వెల్లడించారు.

Minister TG Bharath: జగన్  హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారు
Minister TG Bharath

కడప: గత వైసీపీ హయాంలో పారిశ్రామిక వేత్తలను ఘోరంగా అవమానించారని ఏపీ మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో టెక్స్‌టైల్స్ పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఎందకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గైడ్‌లైన్స్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చామని అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసునని చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టవద్దని ఫారెన్ కంపెనీలు ఏపీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాయని.. ఆ విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలన సాగిందని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వాతంత్య్రం వచ్చిందని కొందరు పారిశ్రామిక వేత్తలు తనతో చెప్పారని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్.


కూటమి ప్రభుత్వంలో కంపెనీలకు అన్ని పాలసీలు, గైడ్‌లైన్స్..

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతిస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుని వైసీపీ హయాంలో 10 మందికే పరిమితం చేశారని... 2014-19 టీడీపీ హయాంలో 60 మందితో పనిచేశామని గుర్తుచేశారు. నేడు దాదాపు 50 మంది పనిచేస్తున్నారని తెలిపారు. మన ప్రభుత్వ విధానాలు ప్రమోట్ చేయడంలో ఈ బోర్డు పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా ఒక బోర్డు జపాన్‌లో పర్యటిస్తోందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంపెనీలకు అన్ని పాలసీలు, గైడ్‌లైన్స్ తీసుకొచ్చామని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెన్స్‌ గురించి చెబుతారని తెలిపారు మంత్రి టీజీ భరత్.


చంద్రబాబు.. కష్టపడే లీడర్

‘సీఎం చంద్రబాబు మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదు. బయటి దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ. నేను ఈ మధ్య ఇండియా‌టుడే కాంక్లేవ్‌ కోసం దుబాయ్‌కి వెళ్లాను. శోభ బిల్డర్స్ అధినేత చంద్రబాబుకి పరిచయం లేదు, చూసింది, కలిసింది లేదు. ఓ సందర్భంలో శోభ బిల్డర్స్ అధినేత రూ.100 కోట్లు ఏపీకి విరాళంగా ఇచ్చారు. చంద్రబాబు లాంటి లీడర్‌షిప్ నాయకుడు మీకు ఉన్నారని శోభ బిల్డర్స్ అధినేత చెప్పారు. చంద్రబాబు ఏవిధంగా కష్టపడుతున్నారో మనందరికీ తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు అన్నారు.. కానీ పట్టుదలతో దాదాపు 3 వేల కిలోమీటర్లకుపైగా లోకేష్ పాదయాత్ర చేశారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలు, కన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు’ అని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు.


భారీగా పెట్టుబడులు సాధించాం..

‘పల్లా శ్రీనివాస్ ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. ఒక కంపెనీ ఏర్పాటు కావడం ఆలస్యమైతే వడ్డీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఉదాహరణకి కర్నూల్‌లో ఉన్న జైరాజ్ స్టీల్స్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కొన్ని కోట్లు వడ్డీలకే సరిపోతుంది. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉంటే త్వరగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించేలా పాలన సాగిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 11 ప్రారంభించాం. 39 పార్కులకు ఫౌండేషన్ వేశాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా పనిచేస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి. కచ్చితంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ అని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 27 , 2025 | 06:22 PM