Minister Payyavula Keshav: అమరావతిపై విషం చిమ్ముతున్నారు.. జగన్పై మంత్రి పయ్యావుల ఫైర్
ABN , Publish Date - May 22 , 2025 | 03:57 PM
Minister Payyavula Keshav: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనేనని విమర్శలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.

అనంతపురం: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అమరావతిపై విషం చిమ్ముతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ తన అస్తిత్వం కాపాడుకోవటానికి ఉన్నవి, లేనివి చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన మాటలు వింటుంటే ఏపీకి పరిశ్రమలు రాకూడదన్నట్లుగా ఉందని మండిపడ్డారు. జగన్ మీడియా సమావేశం పెడుతున్నారంటే నాలుగు సలహాలు ఇస్తారని తాము అనుకున్నామని చెప్పారు. ఇవాళ(గురువారం) అనంతపురం జిల్లాలో మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
లిక్కర్ పాలసీ అక్రమమని ఆయన అంటున్నారని… ఇవాళ ఉన్నది మీ నాన్న హయాంలో ఉన్నది ఒక్కటే పాలసీ అని.. అప్పుడు స్కాం కనిపించలేదా అని ప్రశ్నించారు మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ పాలనలో గ్రామస్థాయి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు కప్పం కట్టారని ఆరోపించారు. ల్యాండ్, మైన్స్, సాండ్, వైన్స్ అన్ని స్కాములు జరిగింది జగన్ హయాంలోనేనని విమర్శలు చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ఖర్చు మూడింతలు అయిందని అన్నారు. జగన్కి ఎక్కడో భయం కలిగి ఈ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. 3.5 లక్షల ఎకరాలకు ఏ ఆధారం లేకుండా ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
విశాఖపట్నాన్ని నాశనం చేశారు, పరిశ్రమలను తరిమేశారని ఫైర్ అయ్యారు మంత్రి పయ్యావుల కేశవ్. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని అన్నారు. అనంతపురంలో రూ. 22 వేల కోట్లతో రెవెన్యూ వచ్చిందని ప్రకటించారు. ఐదేళ్ల పాలనలో రూ.10లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించారు. రూ.3.5 లక్షల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రానికి రాకుండా ఆపారని చెప్పుకొచ్చారు. జగన్ చేసిన అప్పులకు వడ్డీ కోసం తాము అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
దివంగత నేత రాజశేఖర్రెడ్డి రూపాయికు ఎకరా భూమిని పరిశ్రమలకు కట్టబెట్టారని ఇదొక పాలసీనా అని ప్రశ్నించారు.. మీ లాగా మూడు లక్షల ఎకరాలను తమ ప్రభుత్వం కొట్టేయలేదని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. రూ.9,600 కోట్లు పలు పరిశ్రమలకు బకాయిలు చెల్లించలేదని చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ మీడియా ముందుకు వస్తే అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు గుర్తుకు వస్తాయని సెటైర్లు గుప్పించారు. జగన్ హయాంలో లక్షకు పైగా పిల్లలు డ్రాపౌట్ అయ్యారని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలన రాష్ట్రానికి హానికరమని మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీని దోచుకునే పార్టీ జగన్దే..: మంత్రి గొట్టిపాటి రవికుమార్
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి సంపద సృష్టిస్తుందని అన్నారు. ఇవాళ(గురువారం) బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని దోచుకునే పార్టీ జగన్దేనని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి రెండు కళ్లు అని ఉద్ఘాటించారు. దేశంలో నదులు అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరేనని గుర్తుచేశారు. దేశంలో కోటి సభ్యత్వాలు ఉన్న ఘనత టీడీపీకే దక్కుతుందని తెలిపారు. రూ.33 వేల కోట్ల పెన్షన్లను తమ ప్రభుత్వలో అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Pawan Kalyan: ఇది మనందరి బాధ్యత.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Tirumala: తిరుమలలో ఓ వ్యక్తి బహిరంగంగా చేసిన పని చూస్తే
ఏపీకి కుంకీ ఏనుగులు.. లోకేష్ స్పందన ఇదీ
AP Ration Card: రేషన్కార్డులపై ఆందోళన వద్దు.. ఇది నిరంతర ప్రక్రియ
Read latest AP News And Telugu News