Minister Anagani Satya Prasad: జగన్ ప్రభుత్వంలో స్కీమ్ల పేరుతో స్కామ్లకు పాల్పడ్డారు
ABN , Publish Date - May 21 , 2025 | 03:31 PM
Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.

బాపట్ల జిల్లా: గత జగన్ ప్రభుత్వంలో అప్పులు తెచ్చి వివిధ స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసి వారి జేబులు నింపుకున్నారని ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) ఆరోపించారు. రెవెన్యూ శాఖలో భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అటవీ, పేదల భూములను దోచుకున్నారని.. వీరందరీపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మరోసారి అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం లేకుండా వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తున్నామని ఉద్ఘాటించారు. కూటమి ప్రభుత్వానికి ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలు కూడా సంతోషంగా ఉండేలా కచ్చితంగా చూసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. పార్టీ కార్యకర్తలంతా కష్టకాలంలో పార్టీకి రక్షణకవచంలా నిలిచారని అన్నారు. పార్టీ కార్యకర్తల మనస్సుల్లో ఎప్పుడూ తనకు స్థానం ఉండాలనేది తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. కార్యకర్తలే తన కుటుంబ సభ్యులని.. వారి తర్వాతే తనకు ఎవరైనా అని ఉద్ఘాటించారు. కార్యకర్తలను మించి తనకెవ్వరూ ఆత్మీయులు లేరని చెప్పారు. కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని, ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
ముందు రేపల్లే ప్రాంత అభివృద్ధి ముఖ్యమని.. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లె నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చాలని కోరారు. కుప్పం, మంగళగరి, పిఠాపురం నియోజకవర్గాల మాదిరిగా తన నియోజకవర్గం గురించి కూడా అందరూ మాట్లాడుకోవాలని ఆకాక్షించారు. కార్యకర్తల కోసం టీడీపీ పని చేస్తుందని అన్నారు. పల్నాడులో వైసీపీ గూండాల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చామని గుర్తుచేశారు. మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని అద్భుతమైన అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ కలసి పనిచేద్దామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Kumki Elephants: ఏపీకి కుంకీ ఏనుగులు అప్పగించిన కర్ణాటక ప్రభుత్వం
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా
Photo Controversy: మారని అధికారులు.. జడ్పీ ఆఫీస్లో జగన్ ఫోటో.. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు
Minister Lokesh: కార్యకర్తల బాధ్యత నాదే.. ఇకపై నేరుగా కలుస్తా.. లోకేష్ కీలక నిర్ణయం
Read Latest AP News And Telugu News