AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ
ABN , Publish Date - May 20 , 2025 | 01:54 PM
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీలో ప్రధానంగా రైతాంగ సమస్యలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ(మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశవిదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం ఉందని చెప్పారు.
మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షిస్తుందని తెలిపారు. కేబినెట్ సమావేశంలో 45 నిమిషాల పాటు వ్యవసాయరంగం, అన్నదాతల కష్టాలు, మార్కెటింగ్పై ముఖ్యమంత్రి చర్చించారు. రైతులకు స్వాంతన చేకూరేలా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Education Department: మోడల్ స్కూల్స్ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్
Kuppam: రేపు కుప్పం రానున్న చంద్రబాబు
APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్ అమలుపై మార్గదర్శకాలు
Read Latest AP News And Telugu News