Home » AP Cabinet Meet
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలతో పాటు, అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.
ఎల్పీజీ సిలెండర్లకు బదులుగా పైప్డ్ గ్యాస్ను వాడేలా చర్యలు తీసుకోవాలని ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతరం సరఫరా అవుతుందన్నారు.
ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ యుద్ధంపై ఏపీ క్యాబినెట్ నేడు చర్చించనుంది. యుద్ధం కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలపై పడుతున్న ప్రభావాన్ని శాఖల వారీగా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన 2027 గోదావరి పుష్కరాలపై క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ(గురువారం) సచివాలయం 5వ బ్లాక్లోని కాన్ఫరెన్స్ హాల్లో భేటీ అయింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంగళవారం సమావేశం కానుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకోనుంది.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ ఇచ్చిన నివేదికలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పూర్తిగా టెండర్ నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యి కల్తీ అంశంలో సిట్ ఇచ్చిన నివేదకపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా టీటీడీ లడ్డు నెయ్యి కల్తీపైనే చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.