Home » ABN
ఎండలు పెరుగుతున్న కొద్దీ చాలా మందిని వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు. చర్మ రంధ్రాలు పూడుకుపోయి చెమట బయటకు రానప్పుడు చెమటకాయలు ఏర్పడతాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే అవి ఇట్టే మాయమవుతాయి.
వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
ఎండలు మండిపోతున్నాయి.. మనషులే కాదు మూగజీవాలు ఎండతాపానికి విలవిలలాడిపోతున్నాయి. ఎక్కడ నీడ ఉంటే అక్కడ కొంతసేపు సేదతీరే పరిస్థితి. చల్లని పానీయాల కోసం పరుగులు తీస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం మళ్ళీ మారుతోంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అమరావతిని రాజధానిగా చేస్తూ కేంద్రం చట్టం చేస్తోందని.. దీనిని ప్రజల్లోకి సగర్వంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం అమరావతిలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారతదేశ ప్రముఖ ఏఐ బేస్డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్వర్స్.ఏఐల మాతృసంస్థ వెర్స్ ఇన్నోవేషన్ స్వతంత్ర డైరెక్టర్గా పీఆర్.రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు వెర్స్ ఇన్నోవేషన్ ప్రకటించింది.
హైదరాబాద్లోని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి ఆస్తి పన్ను చెల్లించక పోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. మంగళవారం దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు.
వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చే వలసదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నామని.. అవసరం కోసం వచ్చే అవకాశవాదులు పార్టీలో కొనసాగుతారనే గ్యారంటీ లేదని ఆయన పేర్కొన్నారు.
వదంతుల కారణంగా ఒకే సారి ఐదు లక్షల గ్యాస్ బుకింగ్లు కావడంతో ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ సరఫరాపై అనేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.