CM Chandrababu: ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ABN , Publish Date - May 26 , 2025 | 10:14 PM
ముమ్మిడివరం యువకుల గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.

అమరావతి: ముమ్మిడివరం యువకుల గల్లంతు ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం కమినిలంక సమీప గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతవ్వడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యలను సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం సూచించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని నీటి వనరులు ఉన్న అన్ని ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి కుంటలు, చెరువులు వంటి ప్రాంతాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించకపోయినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
గాలింపు చర్యలు చేపట్టాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ముమ్మిడివరం వద్ద గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతైన ఘటన ఆవేదన కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు.
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని త్వరితగతిన రప్పించాలి:మంత్రి కందుల దుర్గేష్
కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద 8 మంది యువకుల గల్లంతు ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని త్వరితగతిన రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు.
గాలింపు చర్యలు ముమ్మరం చేస్తాం: ఎస్పీ కృష్ణారావు
ముమ్మిడివరం మండలం కమినిలంక పంచాయతీ పరిధిలోని గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంత్తెన ప్రాంతాన్ని కోనసీమ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పరిశీలించారు. స్థానికులను అడిగి ప్రమాదం జరిగిన తీరును జిల్లా ఎస్పీ తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అన్నారు. ఇవాళ రాత్రి కూడా గాలింపునకు చర్యలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్నామని తెలిపారు. వలలు, గజఈతగాళ్లతో గాలింపునకు చర్యలు చేపట్టామని అన్నారు. జనరేటర్ ఏర్పాటు చేసి లైటింగ్ సౌకర్యం కల్పించాలని అధికారులను కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్కు వల్లభనేని వంశీ
సర్పంచ్ వేధింపులు.. ప్రాణహానీ అంటూ మహిళ ఫిర్యాదు
Read Latest AP News And Telugu News