Share News

CM Chandrababu: పేదలకి సొంతిల్లు ఉండాలనేది నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:30 PM

ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు.

CM Chandrababu: పేదలకి సొంతిల్లు ఉండాలనేది నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అన్నమయ్య జిల్లా, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): తమది పేదల ప్రభుత్వమని.. వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇళ్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే రెండు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై, పొలాల్లో కరెంట్ తయారు చేయిస్తున్నామని వివరించారు. సోలార్, విండ్, వాటర్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మూడు లక్షల గృహాలను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.


పేదవాడికి సొంతిల్లు ఉండాలి..

ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. నిన్న(మంగళవారం) కనిగిరిలో 97 పరిశ్రమలు ప్రారంభించామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు.మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. 2029 నాటికి పేదలకి సొంతిల్లు ఉండాలనేది తన లక్ష్యమని నొక్కిచెప్పారు. ఇళ్లు అంటే నాలుగు గోడలు కాదని.. భవిష్యత్‌కు భద్రత అని అభివర్ణించారు.


జగన్‌‌పై షాకింగ్ కామెంట్స్

జగన్‌‌పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్‌రెడ్డి ఐదేళ్లలో ఏపీని నాశనం చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని విమర్శించారు. ఏపీని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ నిధులను కూడా జగన్ పక్కదారి పట్టించారని దుయ్యబట్టారు. కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా ఇవ్వకుంటే ఏపీకే నష్టమని చెప్పుకొచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వాటా ఇవ్వక చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో 4.73 లక్షల ఇళ్లను రద్దు చేశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణ వ్యవస్థను పూర్తిగా భ్రష్టుపట్టించారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో నివాస యోగ్యం కాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే ఇసుకలోనూ జగన్, ఆయన అనుచరులు దోచుకున్నారని ఆక్షేపించారు. ముస్లింలకు కూడా అందరితో సమానంగా ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నాటికి 5.90 లక్షల గృహాప్రవేశాలు చేయిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...

వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2025 | 02:38 PM