Home » Annamayya District
ఆంధ్రప్రదేశ్లో నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై చోటు చేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది.
రాష్ట్రంలోని ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను కూడా ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా’ అని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు.
వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది.
Palakondrayudu: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మంగళవారం కన్నుమూశారు.బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయనకు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
TDP Leaders Clash: అన్నమయ్య జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇవాళ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఎదుటనే ఢీ అంటే ఢీ అని కొట్టుకునే వరకు ఇరువర్గాల నేతలు వెళ్లారు. రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు మాత్రం వినకపోయే సరికి మంత్రి కూడా చేతులు ఎత్తేశారు. ఈ వివాదాన్ని టీడీపీ హై కమాండ్ దృష్టికి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
అన్నమయ్యజిల్లాలో విషాదం నెలకొంది. మైలపల్లెరాచపల్లెకు చెందిన ఏడేళ్ల వయసుగల ముగ్గురు బాలురు ఈతకు వెళ్లి నీటికుంటలో మునిగి చనిపోయారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో లా అండ్ పరిస్థితులు దిగజారిపోయాయని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని జగన్ విమర్శించారు.
అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డిప్యూటీ కలెక్టర్ రమాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ రమేష్బాబు పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభు త్వాస్పత్రిలో నిర్వహించిన సమావేశంలో టీబీ ముక్త్ భా రత్ పంచాయతీకి ఎన్నికైన యూనిట్ పరిధిలోని మం చూరు, తాటిగుంటపల్లె, కలికిరి మండలం మున్నేళ్లపల్లె, నిమ్మనపల్లె మండలంలో కొండయ్యగారిపల్లె, తవళం పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం టీబీ అంతం మన పంతం నినాదాలతో పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వ హించారు.
పట్టణంలో ఇరుకైన వీధులు, విస్తారమైన రోడ్లలో కూ డా నడిరోడ్లపై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసేశారు. నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలి. కొందరు ప్రైవేటు భవన యజామనులు నడిరోడ్లపై ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తు న్నారు.