తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనీయకుండా పోలీసు అధికారులు తిమ్మంపల్లిలో మరోసారి అడ్డుకున్నారు.
స్థానిక పురపాలక సంఘంలో వీధి దీపాలను విరాళంగా ఇచ్చి ఆదుకునేందకు దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు గతంలో పిలుపునిచ్చారు.
మండలంలోని రావులుడికి గ్రా మంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పాల్గొన్నారు. గ్రామసమస్యలపై ఆరాతీశారు
ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా యాడికి గ్రా మ పంచాయతీ కార్యదర్శి అశ్వర్థమనాయుడు పామిడికి బదిలీ అయ్యారు.
Tension In Tadipatri: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డిగా పరిస్థితి మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి జిల్లాకు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు జేసీ ఇంటికి చేరుకుంటున్నారు.
మండలంలోని రావులచెరువు గ్రామ సచివాలయానికి వైసీపీ జెండా రంగులు ఇం కా దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. సచివాలయానికి ముందుభాగంలోనే వైసీపీ జెండా రంగులు వేశారు. అప్పట్లో ప్రభు త్వ భవనాలకు పార్టీజెండా రంగులు వేయకూ డదని హైకోర్టు ఆదే శాలు ఇచ్చిన అవేవీ పట్టించుకోకుండా ఆ గ్రామ సచివాలయానికి వైసీీపీ రంగులు వేశారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి సమీపంలో నిర్మించిన జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ జగనన్న కాలనీలో 1170 ఇళ్ల పట్టాలను గత వైసీపీ ప్రభుత్వంలో పంపిణీ చేశారు. అయితే అప్పటి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు పలువురు తమ చేతుల్లోకి పట్టాలు తీసుకుని ఇష్టారాజ్యంగా అమ్ముకున్నట్లు సమాచారం.
మండలకేంద్రంలో శుక్రవారం తల్లికి వందనం పథకం లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రాసద్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స్థానిక 237 బూత కమిటీ కన్వీనర్ చాకివేల శిరీష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చార న్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం విలేజ్ హెల్త్ క్లినిక్ (ఆయుష్మాన ఆరోగ్య మందిర్) భవనాలను మంజూరుచేసింది. వీటి నిర్మా ణానికి మూడేళ్ల క్రితమే గత వైపీపీ పాలనలో నిధులు మంజూరుచేసినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి. గ్రామ సచివాలయాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేం ద్రాల భవనాలను గత వైసీపీ ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో మంజూ రు చేసింది.
తమ గ్రామం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంఎంహళ్లి టీడీపీ నాయకులు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో విజ్ఞప్తి చేశారు.