Home » Maoist Encounter
మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్కు మంగళవారం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గడ్ సరిహద్దులో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏవోబీలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య పోటాపోటీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్లు హతమయ్యారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి.
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్రకమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు.
సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంధ్రనాథ్ ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు.
బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నర్సింహాచలం అలియాస్ సుధాకర్తో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ నలుగురు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.
దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటరులో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ (65) మృతి చెందారు.
మోదీ ప్రభుత్వంలో మతం, కులం పేరిట రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. పాకిస్థాన్తో కాల్పుల విరమణకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, మన దేశ పౌరులైన మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోందని మహేష్ గౌడ్ ప్రశ్నించారు.