Maoist Leader Venu: చాలా కోల్పోయాం..సమాజం మారింది.. ఆయుధాలు వీడండి..!

ABN, Publish Date - Nov 19 , 2025 | 12:24 PM

పోలీసుల, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల వేళా ఇటీవల తుపాకీ వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ అగ్ర మావోయిస్టు నాయకుడు మల్లోజులు ఒక వీడియో సందేశం పంపారు. ఇంతకు మావోయిస్టులకు ఆయన ఇచ్చిన సందేశం ఏంటి?.. ఈ వీడియోలో చూడండి.

కొన్ని రోజుల క్రితం లొంగిపోయిన మాజీ అగ్ర మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు కార్యకర్తలు తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని కోరుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాలం మారిందని.. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చిందని అన్నారు. దేశంలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్టులు అడవిని, ఆయుధాలను వీడి ప్రజల్లోకి వచ్చి.. దేశ అభివృద్ధిలో భాగం కావాలని అన్నారు. ఇప్పటికే మనం చాలా మందిని కోల్పోయాం అని.. ఇప్పటికైనా ఆయుధాలు వీడాలని కోరారు. తుపాకిని వీడాలని అనుకున్నవారు ఎవరైనా తనను సంప్రదించాలని చెబుతూ తన మొబైల్ నెంబర్ ను ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ABN ఎక్స్క్లూజివ్ గా మీకోసం..

Updated at - Nov 19 , 2025 | 01:15 PM