Home » Maoist Party
మావోయిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో 2024 ఏడాది విడుదల చేసిన ఓ డాక్యుమెంట్ లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు భద్రతా దళాల అణచివేతపై చర్యలు, పార్టీలో పెరుగిపోతున్న లొంగుబాట్ల నేపథ్యంలో ఈ ప్రకటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డాక్యుమెంట్ను ఆగస్టు 2024 న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పోలిట్ బ్యూరో పంపినట్లు తెలుస్తుంది.
మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్ధేర్ రాజ్ పోలీసులకు సోమవారం లొంగిపోయారు. రామ్ధేర్తో పాటు మరో 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్గఢ్ పోలీసులకు లొంగిపోయారు.
బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. కాంట్రాక్టర్, గుమాస్తాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అయితే, మావోయిస్టుల చెరనుంచి గుమాస్తా తప్పించుకున్నాడు.
మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను శుక్రవారం విడుదల చేశారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో తాజాగా, మరో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఎదుట మావోయిస్టులు లొంగిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివారం మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టులు బంద్కు పిలుపు ఇవ్వడంతో ఏజెన్సీలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
మావోయిస్టు కీలక నేత దేవ్ జీకి సంబంధించి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ రాసింది. పోలీసుల అదుపులోనే దేవ్ జీ ఉన్నారని ఆరోపించింది.
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 1వ తేదీన సాయుధ కాల్పులను విరమిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ప్రకటన విడుదల చేశారు.
గత రెండు నెలలుగా ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గినట్టు కనిపించినా, లోపల రీ-ఆర్గనైజేషన్ జరుగుతోందన్న నిఘా రిపోర్టులు ఆధారంగా గ్రే హౌండ్స్, ఏపీ స్పెషల్ పార్టీ, ఆక్టోపస్ బృందాలు కలిసి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. తాజా అరెస్టులతో ..
అల్లూరి జిల్లాలో వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.