Kishan Reddy: కేసీఆర్ ఆ ఆధారాలు బయటపెట్టు.. కిషన్రెడ్డి మాస్ సవాల్
ABN , Publish Date - May 30 , 2025 | 07:14 PM
బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో. కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని కిషన్రెడ్డి అన్నారు.

ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తాజాగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది డాడీ, డాటర్ సమస్య.. సిస్టర్, బ్రదర్ సమస్య.. ఇది ఒక కుటుంబ సమస్య అని విమర్శించారు. ఆస్తులు, పదవుల పంచాయితీ ఇదని.. వాళ్ల డ్రామాలో తాము భాగస్వామ్యం కాబోమని స్పష్టం చేశారు. బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిగాయో... మాజీ సీఎం కేసీఆర్ ఆ ఆధారాలను బయట పెట్టాలని సవాల్ చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని అన్నారు. కవిత ఎపిసోడ్పై బీజేపీ నేతలు స్పందించవద్దని కిషన్రెడ్డి ఆదేశించారు.
రాహుల్గాంధీకి మెచ్యూరిటీ లేదు...
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను భారత ఆర్మీ నేలమట్టం చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన 28 నిమిషాల్లోనే.. కీలక ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిందని వివరించారు. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారని.. రాహుల్గాంధీ అడిగి ఉంటే సంతోషపడేవాళ్లమని చెప్పారు. దేశ రక్షణకు సంబంధించిన సున్నిత అంశాలపై.. మాట్లాడే విషయంలో రాహుల్గాంధీకి మెచ్యూరిటీ లేదని మండిపడ్డారు. భారతసైన్యం ధైర్య, సాహసాలను అనుమానించేలా.. రాహుల్గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సైన్యం పరాక్రమాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా.. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సైనికులను అవమానించేలా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
కరీంనగర్ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు
అన్నింటినీ భరించుకుంటూ వచ్చా.. సిన్సియర్గా పనిచేశా.. అయినప్పటికీ
Read Latest Telangana News And Telugu News