Minister Seethakka: స్కాములు చేసిన వారిని వదలం.. మంత్రి సీతక్క మాస్ వార్నింగ్
ABN , Publish Date - May 03 , 2025 | 01:14 PM
Minister Seethakka: బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ స్కీములో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ పథకంలో అవినీతి చేసిన వారిని వదలమని మంత్రి సీతక్క హెచ్చరించారు.

మహబూబాబాద్: గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో స్కీముల పేరుతో స్కాములు చేసిన వారిని వదలమని మంత్రి సీతక్క (Minister Seethakka) హెచ్చరించారు. ఇవాళ(శనివారం) కొత్తగూడ మండలం బత్తులపల్లిలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. గొర్రెల పంపిణీ స్కీములో డబ్బులు తీసుకున్న వారిని ముక్కుపిండి వసూల్ చేస్తామని అన్నారు. తమ ప్రభుత్వంలో ఈ గొర్రెల పథకాన్ని వినుత్నoగా అమలు చేస్తామని ప్రకటించారు. రామప్ప వరల్డ్ హెరిటేజ్ కాబట్టి ప్రపంచ దేశాల సుందరీమణులను ఆహ్వానిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
బడుగు బలహీనవర్గాల నేత దామోదర సంజీవయ్య: హనుమంతురావు
బడుగు బలహీనవర్గాలకు చెందిన నేత దామోదర సంజీవయ్య అని టీపీసీసీ మాజీ చీఫ్ వీ. హనుమంతురావు (Hanumanthurao) కొనియాడారు. శనివారం నాడు హైదరాబాద్లోని గాంధీ భవన్లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. మే 7వ తేదీన దామోదర సంజీవయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి పార్టీ ముఖ్య నేతలు అంతా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. దామోదర సంజీవయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహా ఆవిష్కరణ కోసం అదే రోజు వారి గ్రామానికి వెళ్తున్నానని తెలిపారు. సొంత ఇల్లు లేని ఏకైక ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య అని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దామోదర సంజీవయ్య అందించిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో బలహీన వర్గాల కోసం దామోదర సంజీవయ్య ఎనలేని కృషి చేశారని ఉద్ఘాటించారు. నెక్లెస్ రోడ్డులో ఉన్న సంజీవయ్య విగ్రహానికి నివాళులు అర్పించడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు భారీగా హాజరుకావాలని హనుమంతురావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: రెండో రోజు తగ్గిన బంగారం, వెండి ధరలు..ఇంకా తగ్గుతాయా..
Lift Irrigation: మళ్లీ సీడబ్ల్యూసీకి ‘పాలమూరు’ డీపీఆర్
Kishan Reddy: ఓల్డ్ సిటీకీ నిధులు కేటాయించాలి
పెద్దపల్లి ఎయిర్పోర్టు.. బసంత్నగర్లో కాదు.. అంతర్గాంలో!
Read Latest Telangana News and Telugu News