Home » Minister Seethakka
Minister Seethakka: మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తామని వెల్లడించారు. బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తామనన్నారు.
Minister Seethakka: వన్యప్రాణులకు ప్రమాదమని రహదారులు వేయనీయకపోతే ఎలా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. వన్యప్రాణులకు ప్రత్యేక బ్రిడ్జిలు వేయడం ద్వారా వాటిని కాపాడవచ్చని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఇక్కడ కూడా అవే నిబంధనలను అమలు చేయాలని మంత్రి సీతక్క కోరారు.
నాగారం భూదాన్ భూకుంభకోణం కేసులో ఈడీ వేసిన కేసును కొట్టేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు ఉపశమనం కల్పించలేమని పేర్కొంటూ, ఈడీకి నోటీసులు జారీ చేసి విచారణను జూన్కు వాయిదా వేసింది.
మాజీ మంత్రి హరీష్రావు రాసిన లేఖపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. పదేళ్ల పాలనలో అంగన్వాడీ సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయానికీ తెలంగాణ సెంటిమెంటును రుద్దకండంటూ హెచ్చరించారు.
Minister Seethakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం నాడు పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు అభివద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Minister Seethakka: బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ స్కీములో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ పథకంలో అవినీతి చేసిన వారిని వదలమని మంత్రి సీతక్క హెచ్చరించారు.
కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్గా చూపించాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు
‘టీం సివంగి’ పేరుతో మహిళా కమాండోలు ప్రారంభం అయింది, వీరు సాయుధ శిక్షణ పొందిన తర్వాత ప్రజాసేవలో పాలు పడుతున్నారు.మహిళా కమాండోలు తమ సాహసోపేత కార్యకలాపాలతో ప్రజలను రక్షిస్తున్నారు.