Share News

MP Raghunandan Rao: హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్

ABN , Publish Date - May 12 , 2025 | 03:04 PM

MP Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.

MP Raghunandan Rao: హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్
Medak MP Raghunandan Rao

సంగారెడ్డి: జిన్నారం మదర్సాపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తానని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Medak MP Raghunandan Rao) తెలిపారు. రేవంత్ ప్రభుత్వం దేశ ద్రోహులకు మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించారు. ఒక ఎంపీగా అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. జిన్నారం మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తలను ఇవాళ(సోమవారం) సంగారెడ్డి సెంట్రల్ జైల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు. ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడారు.


జిన్నారంలో అరెస్ట్ చేసిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కిషన్‌గంజ్ పేరుతో జిన్నారం మదర్సాలో ఉంటున్నది ఎవరని ప్రశ్నించారు. జిన్నారంలోని కోదండ రామాలయం భూముల్లో అక్రమంగా మదర్సా నిర్మించారని ఆరోపించారు. జిన్నారంలో అక్రమ అరెస్టులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన బీజేపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిన్నారం వ్యవహారంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఎందుకు స్పందించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.


జిన్నారంలో ఏం జరుగుతుందో వెంటనే విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగుసార్లు ఎంపీగా తాను అడిగినా సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిన్నారం, పటాన్‌చెరు‌ మదర్సాల్లో చదువు చెప్పడానికి ఎక్కడి నుంచి తీసుకువచ్చారని ప్రశ్నించారు. జిన్నారం వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వకపోతే హిందువులు విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్ నందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఏ కేసుల్లో వారిని అరెస్ట్ చేశారని నిలదీశారు. ఆ మదర్సా ఉనికి గురించి రేవంత్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 03:16 PM