Share News

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 12 , 2025 | 02:40 PM

Mahesh Kumar Goud: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై  మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Mahesh Kumar Goud

హైదరాబాద్: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Etala Rajender) దిగజారి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్ వాడిన బాష చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) గాంధీభవన్‌లో మీడియాతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు పదవి రాకుండా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అడ్డుపడుతుంటే ఆ ఫ్రస్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డిపై ఈటల రాజేందర్ చూపిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు.


దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో తరిమేస్తే బీజేపీలోకి ఈటల రాజేందర్ పోయారని అన్నారు. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లే ఆలోచనలో ఈటల రాజేందర్ ఉన్నారని ఆరోపించారు. ఒక్క విజిల్ వేస్తే ఈటల సంగతి ఏంటో తమ కార్యకర్తలు చూసుకుంటారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల్లో ఈటల ఒకరని ఆరోపించారు. ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్ వాఖ్యలు ఒకేలా ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు.


బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

beerla ilaiah.jpg

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పదేళ్ల బీఆర్ఎస్ పాపాలపైన మాట్లాడినందుకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ధన్యవాదాలు తెలిపారు. భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని.. సామాజిక తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ కవిత మాట్లాడారని చెప్పారు. బీఆర్ఎస్ మూడు ముక్కలు, నాలుగు చెక్కలుగా మారబోతుందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కవిత పదవులు అనుభవించి వేల కోట్లు దండుకుని.. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాపాలపై కవిత ఇప్పుడు మాట్లాడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట నడుస్తోందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు.


మాజీ మంత్రి హరీష్‌రావు, కవితలను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించాలని కేటీఆర్ చూస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నందు వల్లనే రైతుబంధు, సామాజిక తెలంగాణ విషయాలను కవిత మాట్లాడుతోందని చెప్పారు. గతంలో విజయశాంతి, ఆలే నరేంద్రలను బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించినట్లే కవితను కూడా బయటకు పంపుతారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కోసం కవిత జైలుకు పోలేదని... లిక్కర్ స్కాం చేసి జైలుకు వెళ్లిందని విమర్శించారు. కేసీఆర్ చేసిన అప్పులు, కేటీఆర్ చేసిన తప్పులను కవిత బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీలో విలువ, గౌరవం లేకపోవడంతోనే కవిత మాట్లాడుతోందని అన్నారు. కరివేపాకులా కవితను బీఆర్ఎస్‌లో చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అరిగోస పడినప్పుడు కవిత మాట్లాడితే బాగుండేదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2025 | 03:17 PM