Kishan Reddy: మన్కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారు
ABN , Publish Date - May 25 , 2025 | 05:06 PM
Kishan Reddy: ప్రధాని మోదీ మన్కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో మమేకవుతున్నారని కిషన్రెడ్డి తెలిపారు.

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) మన్కీ బాత్ (Mann Ki Baat) ద్వారా ప్రజలకు చాలా అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం ఎవరూ చేపట్టలేదని అన్నారు. ప్రధాని మోదీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రతినెలా చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలతో మమేకమవుతున్నారని తెలిపారు. మన్కీ బాత్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ సనత్నగర్లోని లింగయ్య నగర్లో స్థానికులతో కలసి కిషన్రెడ్డి ఈ కార్యక్రమం వీక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించడంపై మహిళలకు శిక్షణ ఇచ్చామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు. వారు వ్యవసాయానికి సంబంధించిన వివిధ పనుల కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఘటనలో 26మంది అమాయకులైన మన పర్యాటకులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మన సైనికులు పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి నాశనం చేశారని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా తీరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఉగ్ర దాడులను సమర్థంగా ఎదుర్కోవడంలో మన సైనికులు ముందున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ఇవాళ(ఆదివారం) జరిగిన మన్కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణలోని డ్రోన్దీదీలను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లాలో మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ తీసుకున్నారని చెప్పారు. పండ్ల తోటలపై పురుగు మందులు వాడటానికి డ్రోన్లను వినియోగించారని తెలిపారు. ఈ క్రమంలో డ్రోన్ దీదీలను స్కైవారియర్స్గా ప్రధాని మోదీ అభివర్ణించారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: కవిత కొత్త పార్టీ పెడుతుందని ప్రచారం.. KCRతో KTR మీటింగ్..
Ponnam Prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం
Read Latest Telangana News And Telugu News