Harish Rao: విందులు వినోదాల కోసమే మిస్ వరల్డ్ అందాల పోటీలు:హరీష్రావు
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:28 PM
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లినీ మార్చారని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. .కేసీఆర్ గుర్తులను మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని... కేసీఆర్ చెసిన అభివృద్ధిని కూడా మారుస్తారా అని హరీష్రావు ప్రశ్నించారు.

సిద్దిపేట జిల్లా: విందులు వినోదాల కోసమే మిస్ వరల్డ్ అందాల పోటీలు పెట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు విమర్శించారు. అందాల పోటీలు వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు మాత్రమేనని మండిపడ్డారు. అందాల పోటీలు పెట్టీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. అందాల పోటీలు పెట్టీ ఇంగ్లాండ్ అమ్మాయిని సీఎం రేవంత్రెడ్డి దోస్తులు ఇబ్బంది పెట్టితే ఆమె పారిపోయిందని విమర్శించారు. మహిళల పట్ల రేవంత్రెడ్డి దోస్తులు అనుచితంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.ఇవాళ(ఆదివారం) జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం, తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు తెస్తామని చెప్పి తెలంగాణ తల్లినీ మార్చారని మండిపడ్డారు.కేసీఆర్ గుర్తులను మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని... కేసీఆర్ చెసిన అభివృద్ధిని కూడా మారుస్తారా అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్ పోయేది కాదని.. ఇప్పుడు మాత్రం కరెంట్ను కట్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని హరీష్రావు మండిపడ్డారు.