Harish Rao: కాళేశ్వరం కమిషన్ విచారణకు భయపడేది లేదు: హరీష్రావు
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:00 PM
బీఆర్ఎస్పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని హరీష్రావు తెలిపారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతోనే (Kaleshwaram Project) తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీమంత్రి హరీష్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రెజెంటేషన్ అనంతరం మీడియాతో హరీష్రావు మాట్లాడారు. కాంగ్రెస్కు రాష్ట్ర ప్రయోజనాల కంటే..రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కాళేశ్వరం కూలిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచార చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్రావు.
కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతామని మాజీ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. కమిషన్ విచారణకు భయపడేది లేదని.. కమిషన్ ఎదుట వాస్తవాలు ఉంచుతామని అన్నారు. బీజేపీకి NDSA జేబు సంస్థలా మారిందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ మాదిరిగా NDSA వ్యవహరిస్తోందని చెప్పారు. పిల్లర్ కుంగితే 2 రోజుల్లో NDSA వచ్చిందని.. మూడు రోజుల్లోనే NDSA నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామని చెప్పారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. కుంగిన మేడిగడ్డ పిల్లర్కు రిపేర్ చేయించాలని కోరారు మాజీ మంత్రి హరీష్రావు.
కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు.. 21 పంప్హౌస్లు, 203 కి.మీ. సొరంగాలు అని మాజీ మంత్రి హరీష్రావు తెలిపారు. కాళేశ్వరం అంటే 1.531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్.. 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీ. ఎత్తు ఎత్తిపోతలని వివరించారు. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల వినియోగం జరుగుతోందని స్పష్టం చేశారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని చెప్పారు. బీఆర్ఎస్పై బురద జల్లేందుకే మేడిగడ్డకు రిపేర్లు చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని అన్నారు. గతంలో ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్రావు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 2,300 చెరువులను నీటితో నింపామని మాజీ మంత్రి హరీష్రావు గుర్తుచేశారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. SRSP తప్ప తెలంగాణలో ఎక్కడా స్టోరేజ్ కెపాసిటీ లేదని అన్నారు. కాళేశ్వరం లేకున్నా పంటలు పండాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. కేసీఆర్ను బద్నాం చేయడానికే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని విమర్శలు చేశారు. కాళేశ్వరం ద్వారా 20,33,578 ఎకరాలకు సాగునీరు అందిందని వెల్లడించారు మాజీ మంత్రి హరీష్రావు.
కాళేశ్వరం నీరు ద్వారా పంటలను కాపాడింది మాజీ సీఎం కేసీఆరే అని ఉద్ఘాటించారు. 2007లో ప్రాణహిత-చేవెళ్లకు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయం రూ.17 వేల కోట్లు అన్నారని.. ఆ ప్రాజెక్టు ప్రారంభించకుండానే 2011 నాటికి రూ.40 వేలకోట్లని మరోసారి చెప్పారన్నారు. నాలుగేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారని.. కనీసం ప్రాజెక్టు అనుమతులు కూడా తీసుకురాలేదని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకుండానే.. కాల్వల తవ్వకం పనులు చేపట్టారని తెలిపారు. సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద.. కాంట్రాక్టర్లకు రూ.2,328 కోట్లు చెల్లించారని మాజీ మంత్రి హరీష్రావు పేర్కొన్నారు
ఈ వార్తలు కూడా చదవండి
రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ
రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ
Read Latest Telangana News And Telugu News