Home » Kaleshwaram Project
రిమాండ్లో ఉన్న ఈఎన్సీ హరీరామ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఏసీబీ అధికారులు హరీ రామ్ను అరెస్ట్ చేసి రీమాండ్కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ కూడబెట్టిన ఆస్తుల విలువ రూ.200 కోట్ల పైమాటేనని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో ఈఎన్సీ హరి రామ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించిన 14 చోట్ల అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సోదాలు ముగిసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున జడ్జి ముందు హాజరు పర్చగా విచారణ జరిపి న్యాయమూర్తి హరిరామ్కు 14 రోజుల రిమాండ్ విధించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ(ఇంజనీర్ ఇన్ చీఫ్) భూక్యా హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శనివారం అరెస్టు అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.
Minister Komati Reddy Venkat Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం ఎనిమిదో వింతగా కేసీఆర్ చెప్పిందే నిజం అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.
ACB Raids: హైదరాబాద్లో ఏకకాలంలో ఏసీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర షోషించిన మాజీ ఈఎన్సీ హరీరామ్ నివాసంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
కాళేశ్వరం బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) నివేదిక ఆధారంగా చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నివేదిక అమలు కోసం కమిటీని వేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని జాతీయ ఆనకట్టల రక్షణ అథారిటీ(ఎన్డీఎ్సఏ) స్పష్టం చేసింది.
18 నెలలుగా కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నివేదిక నెలాఖరున ఇవ్వనున్నట్టు ఎన్డీఎస్ఏ అధికారులు తెలిపారు.