Share News

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్

ABN , Publish Date - May 30 , 2025 | 03:24 PM

కేసీఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తోందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

Adluri Laxman: దళితులను కేసీఆర్ మోసం చేశారు.. అడ్లూరి లక్ష్మణ్ ఫైర్
Adluri Laxman

హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ (KCR) దళిత వర్గాన్ని నట్టేట ముంచారని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) ఆరోపించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని కేసీఆర్ అన్నారని.. అది తన కల అని చెప్పారని ఎందుకు పదేళ్లలో అమలు చేయలేదని ప్రశ్నించారు. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్‌లో మంచిగా చదువుకున్న విద్యార్థులకు కేసీఆర్ ఏనాడైనా ప్రతిభ పురస్కారాలు ఇచ్చారా అని నిలదీశారు. ఇవాళ(శుక్రవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడారు.


దళిత పిల్లలతో కలిసి కేసీఆర్ భోజనం చేశారా అని అడిగారు అడ్లూరి లక్ష్మణ్. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 50 శాతం పురస్కారాలను సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చారని, వాళ్లతో కలసి భోజనం చేస్తున్నారని అన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి ఒక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బిల్డింగ్‌ను.. ఏనాడైనా ఆ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెచ్చారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వస్తున్న ప్రజా ఆదరణను చూడలేకనే బీఆర్ఎస్ నేతలు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కమీషన్ల గురించి కేసీఆర్ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పదేళ్లు కేసీఆర్ హయాంలో కమీషన్లు తీసుకున్నది వారేనని ఆరోపించారు. కోకాపేట్ భూముల్లో కమీషన్లు తీసుకున్నారని విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు పూలదండ వేసే తీరిక లేని కేసీఆర్ దళితుల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పందంగా ఉందని అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు చేశారు.


కేసీఆర్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

Kavvampally-Satyanarayana.jpg

బీఆర్ఎస్ నేతల కళ్లన్నీ ఎప్పడు కమీషన్ల చుట్టేనని మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavampalli Satyanarayana) ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇవాళ(శుక్రవారం) సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. ఇంటిగ్రేటేడ్ పాఠశాలల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండటం హాస్యాస్పందంగా ఉందని దెప్పిపొడిచారు. పేదల గురించి ఆలోచించి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ స్కూళ్లను తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు.


పేద ప్రజల కోసం తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయి, కమీషన్లు లేక తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఇంటర్నేషనల్‌ పాఠశాలలకు దీటుగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలను తమ ప్రభుత్వం నిర్మిస్తోందని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి కనీసం ఆ పాఠశాలలను సందర్శించిన పాపాన పోలేదని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి

కరీంనగర్‌ నుంచి కుట్రలు.. రాజాసింగ్ సంచలన ఆరోపణలు

ఈ ఔషధాలను పరిమితికి మించి వాడుతున్నారా.. కిడ్నీలు రిస్క్‌లో పడ్డట్టే

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 30 , 2025 | 04:34 PM