Home » Lakshman
కేసీఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. దళితుల సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కృషి చేస్తోందని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.
మల్లికార్జున ఖర్గే 11 ఏళ్ల మోదీ పాలనను పీడకలగా చెప్పడం సరికాదని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎమర్జెన్సీని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అది ఓ పీడకల అని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్ను అడుగు అడుగునా అడ్డుకుంది ప్రతిపక్షనేత రాహుల్ గాంధీనే అని లక్ష్మణ్ విమర్శించారు.
MP Laxman: ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయని, అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
MP Laxman: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని విమర్శించారు.
Laxman: సీఎం రేవంత్రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్కు పట్టిన గతే.. రేవంత్కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
MP Lakshman: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన నివేదికపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 శాతం ముస్లిం బీసీలు,36 శాతం హిందూ బీసీలు అని పెట్టారని.. ఇది ఒక భారీ కుట్ర అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అని.. ముస్లిం మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వంమని, రైతు రుణ మాఫీ.. రైతు భరోసా అన్ని ఎగవేతలేనని, ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని.. ఇప్పుడు రూ. 12 వేలకు కోత పెట్టారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. మాయ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్ని నీటి మూటలేనని విమర్శించారు.
కాళేశ్వరం ఎత్తిపోతలలో రూ.లక్ష కోట్లు వెచ్చించినా.. ఆ ప్రాజెక్టు వైఫల్యం ప్రజల కళ్లముందు ఉందని.. వెరసి పదేళ్లలో రాష్ట్రం రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు.
Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల హ్యాంగోవర్ నుంచి బయటపడ్డట్టు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం, ప్రజాస్వామ్యం పట్ల భారత దేశప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ, బీజేపీ వల్ల ప్రధాని కాలేదనే అక్కసుతో దేశం మీద విషం చిమ్ముతున్నారన్నారు.