MP Laxman: కవిత ప్రకటన ఆమెకు సంచలనం అయి ఉండొచ్చు, కానీ..
ABN , Publish Date - May 25 , 2025 | 01:26 PM
MP Laxman: ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయని, అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) బయటకు వచ్చి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతారా అనే అంశంపై స్పష్టత రావాలని, ఆస్తిత్వం కోసమే కవిత ఆరాటమని, ఆమె చేసిన ప్రకటన ఆమెకు సంచలనం అయి ఉండొచ్చు, కానీ ప్రజలకు ఏం సంచలనం కాదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ (BJP MP Laxman) అన్నారు. ‘సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ (New Party)’ అని కవిత చేసిన ప్రకటనపై ఎంపీ స్పందించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు అన్నల మీదికే తిరగబడుతున్నాయని, ఏపీలో షర్మిల రెడ్డి (Sharmila Reddy), వైఎస్ జగన్ (YS Jagan)పై బాణం ఎక్కుపెడితే, తెలంగాణాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కవిత బాణాలు సందిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు.
వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయి..
ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరాలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయని, అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తి ఉందని, అప్పుల ఊబిలో ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బీద అరుపులు అరుస్తూ ప్రజల దృష్టి మారాల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రలో బీజేపీ వెలిగిపోతుందని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ ప్రత్యామ్నాయని.. కవిత, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించమని చెప్పకనే చెప్పారన్నారు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలి..
కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలని, కేటీఆర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే చూస్తున్నామని, మూడో వ్యక్తి ప్రమేయంలేని లేఖను ఎవరు లీక్ చేసారో చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కవిత కాంగ్రెస్పై ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తున్నారని, సామాజిక తెలంగాణ అంటూ కవిత మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు ఎందుకు గుర్తుకు లేరో ముందు సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ అవసరాల కోసమే బీసీ, సామాజిక తెలంగాణ అంశాన్ని ఎత్తుకున్నారని ఆయన విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్రాలు సహకరిస్తే ఉదారంగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, చర్లపల్లి టెర్మినాల్ బాధ్యత రాష్ట్రానిదేనని, భూములు కేటాయించలేదని అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని, సంస్థాగత అంశాల వల్లే బీజేపీ అధ్యక్షుల ప్రకటన ఆలస్యం అవుతుందని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..ః
వంశీకి ఏమైనా జరిగితే ప్రభుత్వం పడిపోతుందా..రా చూద్దాం..
ప్రజల ఆశీర్వాదంతో జరిగిన ఈ శుభకార్యం ఎప్పటికీ గుర్తుంటుంది..
For More AP News and Telugu News