Home » Pressmeet
Gajjal Kantham: రాష్ట్ర ముఖ్యంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాళేశ్వరంపై విచారణ చేయిస్తామని మాట ఇచ్చారని, పీసీసీ చీఫ్గా ఉన్నపుడే రేవంత్ రెడ్డి కాళేశ్వర ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయట పెట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు.
Perni Nani: నకిలీ పట్టాల వివాదంలో పేర్ని నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్నినాని మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
Raja Singh statement: తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని.. తాను వేరే పార్టీలోకి వెళ్లనన్న విషయం వాళ్లకు తెలుసునని.. అందుకే వాళ్లు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అన్నారు.
Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలుగానే తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.
Bonalu festival: గతంలో జరిగిన దానికంటే ఈసారి ఇంకా మంచిగా బోనాల ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని.. పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని మంత్రి అన్నారు.
Rayapati Sailaja: జర్నలిస్టు ముసుగులో మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోరు పారేసుకుంటారా.. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని ఆమె ప్రశ్నించారు.
Mudragada: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తోందంటూ ఆయన తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మనస్పర్దలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Minister Lokesh: విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
PM Modi: రానున్న రోజుల్లో భారత్ పెద్ద వ్యాపార, వాణిజ్య దేశంగా మారబోతోందని, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్లో భాగంగా కేంద్ర మంత్రులంతా విధిగా ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు గడపాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.