Share News

PM Modi: మరో మాట లేదు.. పీవోకే వెనక్కి ఇవ్వాల్సిందే.. పీఎం మోదీ..

ABN , Publish Date - May 11 , 2025 | 07:20 PM

PM Modi PoK Statement: అంతర్జాతీయ సమాజానికి, పాకిస్థాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన సందేశం ఇచ్చారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లో సరిహద్దు వద్ద దాడులను సహించదని.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపై తప్ప మరో అంశంపై పొరుగు దేశంతో చర్చించబోమని తేల్చిచెప్పారు.

PM Modi: మరో మాట లేదు.. పీవోకే వెనక్కి ఇవ్వాల్సిందే.. పీఎం మోదీ..
PM Modi PoK Statement

India PoK Top Priority: భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లో సరిహద్దుల వద్ద నిస్సిగ్గుగా దుశ్చర్యలకు పాల్పడింది పొరుగు దేశం. దీంతో భారత ఆర్మీ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. పేరుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇరు దేశాల మధ్య చిచ్చు రగులుతూనే ఉండటంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. ఈ సంభాషణలో ప్రధాని మోదీ పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె) తిరిగి అప్పగించే విషయంపై మాత్రమే అని స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.


"కశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది. మాట్లాడేందుకు ఇంకేమీ లేదు. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే మనం మాట్లాడుకోవచ్చు. నాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు" అని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్‌తో చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఎవరూ ఈ అంశంపై మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం.


భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన రెండు మూడు గంటల్లోనే ఇండియపై కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. ఆ తర్వాత భారత బలగాలు పాకిస్థాన్ లోని 26 ప్రాంతాలపై దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజానికి, దాయాది దేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరిహద్దు దాడులను ఇకపై సహించబోమని.. అలాంటి చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీన్ని బట్టి జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ అనే మాటే లేదని చెప్పేలా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేపు మధ్యాహ్నం భారత్-పాక్ DGMO ల మధ్య సమావేశం జరగనుంది.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 11 , 2025 | 07:59 PM