రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తు్న్నాయని, రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే.. ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది.
అస్సాం గత పదేళ్లుగా గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేను మరోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారనే నమ్మకం తనకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
తమిళనాడు అభివృద్ధికి డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం తప్పనిసరని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి దానిని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఇరాన్ - అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సతమతమవుతోన్న విమానయాన సంస్థలపై ఇప్పుడు ఇంధన భారం పడింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధర ఆకాశన్నంటింది.
భారతీయ రైల్వే టిక్కెట్ రద్దు, రీఫండ్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం, ఖాళీగా ఉండే సీట్లను ఇతరులకు కేటాయించే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.
సెల్ఫోన్ రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్లిన మహిళపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆమెను లైంగికంగా వేధించారు. మొబైల్ టెక్నీషియన్తో ఆమె ఎఫైర్ పెట్టుకుందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి తొలి దశ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మొదటి దశలో భాగంగా గృహ గణన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా 33 ప్రశ్నలను అడుగుతారని కేంద్రం తెలిపింది.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ఒక కీలక అప్డేట్. ఈ రోజు (ఏప్రిల్ 1) నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలోనే ప్రకటించింది.