Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన పర్యాటకుడు రిషి భట్ను విచారించింది. అతడు ఈ ఉగ్రదాడిపై పలు సంచలన విషయాలను వెల్లడించారు.
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెగాసస్ స్పైవేర్ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.
PM Modi: 21వ శతాబ్దపు డిమాండ్లను తీర్చడానికి దేశ విద్య వ్యవస్థను ఆధునికరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ క్రమంలో భవిష్యత్తులో ప్రతి సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపు నిచ్చారు.
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.
Kashmir Tourist Sites Closed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ కఠిన చర్యలు చేపడుతుండటంతో ఉగ్రవాదులు మరిన్ని దాడులకు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో 48 పర్యాటక ప్రాంతాలను మూసివేశారు.
ఆ చేపలను తినడం ఏమోగాని తాకితేనే వివిధ చర్మ వ్యాధులు వస్తున్నాయట. రామేశ్వరం సమీపం పాక్ జలసంధి ప్రాంతం వద్ద జెల్లీ చేపలు తీరానికి కొట్టుకురావటంతో జాలర్లు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ చేపలను తినడం సంగతి అటుంచితే కనీసం తాకితేనే వివిధ చర్మవ్యాధులు వస్తున్నాయని పలువురు తెలుపుతున్నారు.
పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడు హషీమ్ మూసా..పాక్ మాజీ పారా మిలిటరీ కమాండో అని నిఘా వర్గాలు తాజాగా గుర్తించాయి. గతేడాది జరిగిన ఉగ్రఘటనల్లోనూ అతడు పాలుపంచుకున్నట్టు వెల్లడించాయి.
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రమణ్యస్వామి తాజా ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఆ ట్వీట్ ద్వారా పాకిస్తాన్ను విచ్ఛిన్నం చేసి, నాలుగు ప్రాంతాలుగా విభజించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, దౌత్యపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. అలాగే.. రాష్ట్రంలో మత ఉగ్రవాదాన్ని సహించబోమని కూడా పేర్కొన్నారు. శాసనసభలో సీఎం మాట్లాడారు.