Share News

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:29 PM

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

Mallikarjun Kharge: ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే సంచలన లేఖ
Mallikarjun Kharge

ఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (PM Narendra Modi) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇవాళ(మంగళవారం) లేఖ రాశారు. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీపై ప్రధానికి లేఖ రాశారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ నియామకం ఆలస్యమవుతుండటంపై లేఖలో ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తప్పనిసరి అని తెలిపారు మల్లికార్జున ఖర్గే.


స్పీకర్ తర్వాత లోక్‌సభలో రెండో అత్యున్నత స్థానం డిప్యూటీ స్పీకర్‌దేనని మల్లికార్జున ఖర్గే గుర్తుచేశారు. ప్రతి కొత్త లోక్‌సభ రెండో లేక మూడో సెషన్‌లో డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోవడం సంప్రదాయమని ఉద్ఘాటించారు. మొదటి నుంచి పదహారో లోక్‌సభ వరకు అన్ని లోక్‌సభల్లో డిప్యూటీ స్పీకర్ ఉన్నారని వివరించారు. కానీ 17వ, 18వ లోక్‌సభల్లో ఆ పదవి ఖాళీగా ఉందని చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖర్గే.


ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం సంప్రదాయమని చెప్పారు. ఈ స్థానం ఖాళీగా ఉండటం రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిపారు. వెంటనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలంటూ ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు.

అమ్మాయని కూడా చూల్లేదు.. మరీ దారుణంగా..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 10 , 2025 | 01:34 PM