Home » Parliament Special Session
Palamuru Rangareddy Project: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కృష్ణా నదీ జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో జాతీయ ప్రాజెక్ట్ హోదా సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది.
కేంద్రం త్వరలో 'సహకార్ ట్యాక్సీ' సేవను ప్రారంభించనున్నట్లు హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో స్థానిక సహకార సంఘాలు అగ్రిగేటర్ల పాత్ర పోషిస్తాయి, తద్వారా డ్రైవర్లకు ఎక్కువ లాభాలు, ఆర్థిక భద్రత మరియు స్వాతంత్ర్యం కలుగుతుంది
BC issues in Parliament: పార్లమెంట్లో ఇవాళ బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, ఈటల రాజేందర్, వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని ఎంపీలు డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు పెట్టడం మంచిదేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అయితే జమిలి ఎన్నికలకు ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. వన్ నేషన్.. వన్ ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని తెలిపారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రేపు మరోసారి తీవ్ర చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన బిల్లును ప్రభుత్వం సమర్పించే అవకాశం ఉందని ఆయా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే బీజేపీ తన ఎంపీలకు విప్ జారీ చేసింది.
ఇవాళ మధ్యాహ్నం 12.00గంటలకు పలు కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. బీజేపీ నుంచి 15-18 మంది ప్రసంగించనున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు, కాంగ్రెస్ హయాంలోని చాలా రాజ్యాంగ సవరణలు వంటి పలు అంశాలను ఎన్డీయే లేవనెత్తే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు. మూసీపై పార్లమెంట్లో చర్చ జరిగింది.
కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్"లో ఆంధ్రప్రదేశ్ చేరిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబరు 25 నుంచి డిసెంబరు 20 వరకు జరగనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నవంబరు 26న పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.