Share News

AP News: సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో కుటుంబం

ABN , Publish Date - Jun 01 , 2025 | 05:40 PM

భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ నుంచి సిక్కింకు వెళ్లిన ఓ ఎమ్మార్వో కుటుంబ కూడా ఆ వరదల్లో చిక్కుకుపోయింది.

AP News: సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన విజయనగరం ఎమ్మార్వో  కుటుంబం
Sikkim Floods

ఢిల్లీ: సిక్కింలో భారీ వర్షాలు (Heavy rains in Sikkim) కురుస్తున్నాయి. సిక్కింలో పడుతున్న వర్షాలకు తోడు వరదలు కూడా పొటెత్తడంతో ఆ రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సిక్కింలోని పర్యాటక ప్రాంతాలనూ సందర్శించడానికి విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబంతో (Vizianagaram MRO Kurmanath Rao Family) వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫ్యామిలీ ఉన్న ప్రాంతాన్ని భారీగా వరదలు పొటెత్తడంతో వారు ఆ వరదల్లో చిక్కుకుపోయారు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు వివరాలు తెలుసుకుని ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందజేశారు.


వెంటనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిక్కిం డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో రామ్మోహన్ నాయుడు, అర్జా శ్రీకాంత్ మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రికి సిక్కిం డీజీపీ వివరించారు. అయితే సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన కూర్మనాథరావు కుటుంబం క్షేమంగా బయటపడినట్లు సిక్కిం అధికారులు తెలిపారు. ఫోన్‌లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ మాట్లాడారు. తహసీల్దార్ కూర్మనాథరావు ఫ్యామిలీని ఢిల్లీకి తరలించేందుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పండుగలా ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ

ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోంది..

For More AP News and Telugu News

Updated Date - Jun 01 , 2025 | 05:49 PM