తమ సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ తాగునీటి సరఫరా కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది.
తాగునీటి సరఫరా చేయక పోతే ఊరుకునేది లేదని నాలుగో వార్డు భారత భవనం వీధికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
కురుపాంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి బస్టాండ్లో ఉన్న త్రినాథస్వామి దేవాలయంలోకి మురుగునీరు చేరిపోయింది.
తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్రంలో పండగ వాతావరణం వచ్చిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
గత నెల 21న ఉమ్మడి జిల్లాలోని సాలూరు అల్లువీధి రామమందిరంలో విద్యుత్ ఏడీఈ రంగారావును స్థానికులు నిర్బంధించారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.
మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మ అయితే.. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది మాత్రం తండ్రి. తల్లి మాటలతో ధైర్యం చెబితే.. తండ్రి చేతలతో మనలో ధైర్యం నింపుతాడు.
Dad is a Hero Forever నాన్నంటే కొండంత అండ.. ఎంతటి కష్టంలోనైనా నేనున్నానంటూ నిలిచే ధైర్యం. భవిష్యత్కు భరోసా.. అడుగడుగునా మన వెంట ఉంటూ చేయూతనిచ్చే మార్గదర్శి. పిల్లల ఉన్నతి కోసం పరితపించే నిరంతర శ్రమజీవి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనిది. అందుకే పితృదేవోభవ అంటారు.
Ready for the toli adugu అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 23 నుంచి ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.
పట్టణంలోని గవిడి వీధికి చెందిన విద్యార్థుల తల్లులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటా నికి శనివారం పాలభిషేకం చేశారు.