Crammed into Containers! జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. స్థానిక సంతల్లో కొనుగోలు చేస్తున్న పశువులను కంటైనర్లలో కుక్కి.. యథేచ్ఛగా తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా రాష్ర్టాలకు తరలిస్తున్నారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో ప్రతి వారం జరిగే సంతల నుంచి వందలాది పశువులు కబేళాలకు తరలివెళ్తున్నాయి.
Bravo, Santosh! పాలకొండ నగర పంచాయతీ పరిధి వడమ కాలనీకి చెందిన బొద్దాన కల్యాణ్ ప్రసాద్ (అప్పన్న), పార్వతిల చిన్న కుమారుడైన బొద్దాన సంతోష్ ఏఐ విభాగంలో ప్రతిభ కనబర్చారు. రూ.కోటికి పైగా ప్యాకేజీతో గూగుల్ ఏఐ/ఎంఎల్ విభాగంలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. దీంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Measures to Protect the Rights of Scheduled Tribes జిల్లాలో షెడ్యూల్డ్ కులాలు, తెగల హక్కుల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులతో సమీక్షించారు.
Polytechnic Is Calling పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులు ఉజ్వల భవిష్యత్ను అందిస్తున్నాయి. జీవితంలో త్వరగా స్థిరపడేందుకు దన్నుగా నిలుస్తున్నాయి. పాలిటెక్నిక్లో పలు బ్రాంచీల్లో చేరే వారు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు పొందొచ్చు. స్వయం ఉపాధి, ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు.
Intermediate Classes Begin From Today జిల్లాలో జూనియర్ కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఇంటర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించ నున్నారు.
Just One Day! పంచాయతీల్లో సర్పంచ్ల పదవీ కాలం గురువారంతో ముగియనుంది. ఈనెల 3 నుంచి ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించున్నారు.
మండలం లోని పాతశ్రీరంగరాజపురం గ్రామంలో తాగునీటి కుళా యిలను డ్రైనేజీలో ఏర్పాటు చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“Once Full of Rocks… Now Like a Mirror!” కూటమి ప్రభుత్వం చొరవతో సీతంపేట ఏజెన్సీ లోని పలు గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రాళ్లు తేలి.. అధ్వానంగా దర్శనమిచ్చిన రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తుండడంతో గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలకు మే నెలలో సెలవులు ప్రకటించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
“River at the Threshold” ఎండల తీవ్రత దృష్ట్యా తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో 105 మీటర్లకు గాను 102.21 మీటర్ల మేర నిల్వ ఉంది. రోజురోజుకూ నీరు తగ్గుముఖం పడుతుండ డంతో ఖరీఫ్ సాగుకు ఇబ్బందులు తప్పవేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.