Home » Weather
విజయనగరం, మన్యం, విశాఖ, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఉరుములు, పిడుగుల సమయంలో బయట తిరగొద్దని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. కూకట్పల్లి, మియాపూర్, ఫిల్మ్ నగర్ వంటి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఏపీ వాసులకు మరో కీలక అలర్ట్ జారీ అయింది. ఇవాళ(శనివారం) మరో మూడు గంటల్లో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నట్లు హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నందున ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. భారీ వానల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. అందువల్ల రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండటంతో అలర్ట్ జారీ అయ్యింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.