Share News

Jana Sena MLA: పవన్ కల్యాణ్‌పై కుట్రలు..పేర్నినానిపై జనసేన ఎమ్మెల్యే ఫైర్

ABN , Publish Date - May 25 , 2025 | 07:55 PM

Jana Sena MLA Sundarapu Vijay Kumar: మాజీ మంత్రి పేర్నినానికి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేర్నినాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ కంటే సినిమాల గురించి పేర్నినాని ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు.

Jana Sena MLA: పవన్ కల్యాణ్‌పై కుట్రలు..పేర్నినానిపై జనసేన ఎమ్మెల్యే ఫైర్
MLA Sundarapu Vijay Kumar

విశాఖపట్నం: మాజీమంత్రి పేర్ని నానిపై (Perni Nani) యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ (MLA Sundarapu Vijay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను స్వార్థాలకు వాడుకున్న వాళ్లందరికీ సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఇవాళ(ఆదివారం) విశాఖపట్నం జిల్లాలోని జనసేన కార్యాలయంలో మీడియాతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడారు. పేర్ని నానీ తోక తెగిన కోతిలాగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీలో స్వార్థాలు, సమస్యలు తెలిసిన నాయకుడు పవన్ కల్యాణ్ అని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఉద్ఘాటించారు.


పేర్నినాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ చెప్పారు. పవన్ కల్యాణ్ కంటే సినిమాల గురించి పేర్నినానికి ఎక్కువ తెలుసా అని ప్రశ్నించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్లను ఎలా బ్లాక్ మెయిల్ చేశారో... అవమానించారో అందరికీ తెలుసునని చెప్పారు. పేర్ని నానీ నీతి సూక్తులు చెప్పడం కాదు.. వ్యవహారం తెలుసుకోవాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీగా వస్తే పరిగణలోకి తీసుకుంటామని.. కానీ వ్యక్తులుగా కాదని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. సినిమా థియేటర్స్ ఇష్యూ వైసీపీ హయంలో కూడా ఉందని చెప్పారు. అప్పుడు ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. డిప్యూటీ సీఎంగా తీసుకున్న జీతం పిఠాపురంలో పవన్ కల్యాణ్ పేదల కోసం ఖర్చు పెడుతున్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. అత్తారింటికీ దారేది అన్నట్లుగా లిక్కర్ స్కాం దారులు మీ దగ్గరకే వస్తాయని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హెచ్చరించారు.


లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్ట్ అవుతారు: రియాజ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ కుట్ర చేస్తోందని లైవ్ స్టాక్ బోర్డు ఛైర్మన్ రియాజ్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ సినిమాలు విడుదల సమయంలో రేట్లు తగ్గించారని అన్నారు. ఇవాళ(ఆదివారం) ప్రకాశం జిల్లాలోని జనసేన కార్యాలయంలో మీడియాతో రియాజ్ మాట్లాడారు. పద్మవిభూషణ్ తీసుకున్న చిరంజీవిని కూడా వైసీపీ ప్రభుత్వంలో అగౌరవపరిచారని ధ్వజమెత్తారు. శత్రువుకి కూడా హాని చేయని వ్యక్తి పవన్ కల్యాణ్ అని రియాజ్ అభివర్ణించారు.


పవన్ కల్యాణ్‌ని వెన్నుపోటు పొడవాలని ఇండస్ట్రీలో ఉన్న నలుగురు ప్రయత్నిస్తున్నారని రియాజ్ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సినిమా థియేటర్లు బంద్ పాటించడం నీచమైన చర్య అని చెప్పారు. వైసీపీ నాయకుడు జగన్ అవినీతిలో మునిగిపోయారని విమర్శించారు. త్వరలోనే లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్ట్ అవుతారని చెప్పారు. వైసీపీ ముసుగు వేసుకున్న త్రిపురనేని చిట్టిబాబు పవన్ కల్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీలో నుంచి త్రిపురనేని చిట్టిబాబు‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ఉద్ఘాటించారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన నలుగురు థియేటర్లను చేతుల్లో పెట్టుకుని ప్రేక్షకుల్ని దోచుకుంటున్నారని రియాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం

పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం

For More AP News and Telugu News

Updated Date - May 25 , 2025 | 08:03 PM