Share News

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

ABN , Publish Date - May 20 , 2025 | 12:34 PM

విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..
GVMC Deputy Mayor election

విశాఖపట్నం: జీవీఎంసీ (Visakhapatnam GVMC) ప్రత్యేక సమావేశం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి (Dalli Govind Reddy) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. జాయింట్ కలెక్టర్ ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక తప్పనిసరిగా మారింది.


విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే గణబాబు

విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిందని అన్నారు. కేవలం కోఆర్డినేషన్ సమస్యలతోనే నిన్న(సోమవారం) ఈ ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. ఈరోజు ఆరంభంలోనే ఆమోదం లభించిందని చెప్పారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకోవడం విశాఖ నగర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు.


డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిగింది: ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు

డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈరోజు సజావుగా జరిగిందని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. జీవీఎంసీలో జరిగిన అవకతవకలపై విచారణ చేయిస్తామని అన్నారు. నాలుగు సంవత్సరాలపాటు జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు స్పష్టం చేశారు.


వారిని మాత్రం విడిచిపెట్టం: ఎమ్మెల్యే విజయ్‌కుమార్

డిప్యూటీ మేయర్ ఎన్నికకు కోరం సరిపోతుందనే ధీమాతో ఉండటంతో నిన్న చిన్న పొరపాటు జరిగిందని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. కూటమి పాలనలో మంచి మెరుగైన పాలన అందిస్తామని చెప్పారు. ఇప్పుడు కూటమికి మరింత బాధ్యత పెరిగిందని ఉద్ఘాటించారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, అక్రమాలు చేసిన వారిని మాత్రం విడిచిపెట్టమని హెచ్చరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు.


జనసేనలో కష్టపడిన వారికి గుర్తింపు: డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి

జనసేనలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందనడానికి తానే ఉదాహరణ అని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి తెలిపారు. తాను ఆశించకపోయినా పార్టీ గుర్తించి ఈ పదవి తనకు ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు.


అక్రమాలపై విచారణ: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోఆర్డినేషన్ సమస్యతో సోమవారం వాయిదా పడిందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆశించిన వారు నిరుత్సాహపడటం అనేది సహజమని చెప్పారు. వైసీపీ దురుద్దేశంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. జీవీఎంసీలో జరిగిన అక్రమాలపై చట్టపరంగా విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Education Department: మోడల్‌ స్కూల్స్‌ కాంట్రాక్టు టీచర్ల రెన్యువల్‌

Kuppam: రేపు కుప్పం రానున్న చంద్రబాబు

APSRTC: పీటీడీ ఉద్యోగులకు ఏఏఎస్‌ అమలుపై మార్గదర్శకాలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 20 , 2025 | 01:16 PM