Home » AP BJP
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈనెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర నిర్వహించబోతుంది. అటు, శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ఆదేశాలిచ్చారు.
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.
విజయవాడ పోలీసు కమిషనర్ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు సోమవారం కలిశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై సీపీకి ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలను అభ్యతరకరంగా ధూషించిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీకి వినతి పత్రం ఇచ్చారు.
Bhanuprakash Slams Jagan: ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ నేతలను బెదిరిస్తున్నారని జగన్పై భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాటాకు చప్పులకు భయపడేవారు ఏపీలో ఎవరూ లేరన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేని పరిస్థితుల్లో మాజీ సీఎం ఉన్నారని కామెంట్స్ చేశారు.
BJP MP CM Ramesh: జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్మును కక్కిస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని.. ఆయన బెదిరింపులకు పాల్పడి నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు.
విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.
Daggubati Purandeshwari: ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎన్నో ఆలయాలను రాణి అహల్యభాయి హోల్కర్ నిర్మించారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మహిళల్లో అహల్య భాయి ధైర్యాన్ని నింపారని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
Daggubati Purandeswari: పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ దీటైన జవాబు ఇవ్వడం ఖాయమని పురంధేశ్వరి తెలిపారు.
Purandeswari: మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.
జగన్ పోలీసులపై హేయ వ్యాఖ్యలు చేశారని పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు