Share News

Minister Ravikumar: విద్యుత్ చార్జీలపై మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

ABN , Publish Date - May 12 , 2025 | 11:15 AM

Minister Gottipati Ravikumar: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత జగన్ ప్రభుత్వంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమకు టైం సరిపోతుందని చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ దుర్వినియోగం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు.

Minister Ravikumar: విద్యుత్ చార్జీలపై మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన
Minister Gottipati Ravikumar

ప్రకాశం: విద్యుత్ చార్జీలు పెంచలేదు, పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) స్పష్టం చేశారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ మీద వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మీద వైసీపీ నేతలు పదే పదే బురదజల్లే పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మీడియాతో మాట్లాడారు.


గత ప్రభుత్వంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు సరిదిద్దడానికే తమకు టైం సరిపోతుందని చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. యాక్సిస్ ఎనర్జీకి రూ.5.12లకు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని... తమ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకుని రూ. 4.60లకు పీక్ అవర్స్‌లో కూడా విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం విద్యుత్ శాఖను తమ ఆదాయ వనరుగా మార్చుకుందని విమర్శలు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యువబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు. రెన్యువబుల్ ఎనర్జీలో దేశంలో రాయలసీమ ప్రాంతం అనుకూలమని చెప్పారు. తప్పుచేసిన వారికి రెడ్‌బుక్ వర్తిస్తుందని హెచ్చరించారు. అవసరం లేకుండా ఈ ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. గతంలో తప్పులు చేసిన వారికే రెడ్‌బుక్ వర్తిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 11:25 AM